మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేస్తున్న కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. అతణ్ని హీరోగా పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉప్పెన’ అనే ఆసక్తికర ప్రేమకథను రూపొందించింది. కృతి శెట్టి అనే కొత్తమ్మాయి అతడితో జోడీ కట్టింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడు. ఈ సినిమాను ఏప్రిల్ 2నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ప్రణాళికల్ని దెబ్బ తీసింది.
మధ్యలో ఓటీటీల్లో కొత్త చిత్రాలు రిలీజయ్యే ట్రెండ్ మొదలయ్యాక.. ‘ఉప్పెన’ ఆ మీడియంలోనే రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. మైత్రీ వాళ్లకు మంచి మంచి ఆఫర్లే వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరోను ఓటీటీ ద్వారా అరంగేట్రం చేయించడం బాగుండదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఎంత ఆలస్యమైనప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయారు. కానీ ఆ టైం ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు.
ఇదిలా ఉండగా.. ‘ఉప్పెన’ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు తాజా సమాచారం. అలాగని ఈ సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం లాంటిదేమీ జరగదట. ముందు థియేటర్లలోనే రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్లో రిలీజవుతుందట. పాత పద్ధతిలోనే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలా రెండు నెలల గ్యాప్లో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తెచ్చేలా డీల్ కుదిరిందట.
లాక్ డౌన్ టైంలో ఎడిటింగ్ మీద ఎడిటింగ్ చేసి సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారని.. స్యూర్ షాట్ హిట్ అయ్యే సినిమా ఇదని.. ఈ సినిమాలో కొత్తదనం నచ్చి నెట్ ఫ్లిక్స్ వాళ్లు మంచి రేటుతో డిజిటల్ రైట్స్ తీసుకున్నారని అంటున్నారు. కాలం కలిసొస్తే సంక్రాంతికి.. లేదంటే ఆ తర్వాత థియేటర్లు 100 పర్సంట్ నడిచే సమయంలోనే ‘ఉప్పెన’ను విడుదల చేయాలన్నది మైత్రీ వాళ్ల ప్లాన్. ఈ సినిమా రిలీజవకముందే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేయడం విశేషం.
This post was last modified on December 17, 2020 4:43 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…