మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేస్తున్న కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. అతణ్ని హీరోగా పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉప్పెన’ అనే ఆసక్తికర ప్రేమకథను రూపొందించింది. కృతి శెట్టి అనే కొత్తమ్మాయి అతడితో జోడీ కట్టింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడు. ఈ సినిమాను ఏప్రిల్ 2నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ప్రణాళికల్ని దెబ్బ తీసింది.
మధ్యలో ఓటీటీల్లో కొత్త చిత్రాలు రిలీజయ్యే ట్రెండ్ మొదలయ్యాక.. ‘ఉప్పెన’ ఆ మీడియంలోనే రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. మైత్రీ వాళ్లకు మంచి మంచి ఆఫర్లే వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరోను ఓటీటీ ద్వారా అరంగేట్రం చేయించడం బాగుండదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఎంత ఆలస్యమైనప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయారు. కానీ ఆ టైం ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు.
ఇదిలా ఉండగా.. ‘ఉప్పెన’ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు తాజా సమాచారం. అలాగని ఈ సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం లాంటిదేమీ జరగదట. ముందు థియేటర్లలోనే రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్లో రిలీజవుతుందట. పాత పద్ధతిలోనే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలా రెండు నెలల గ్యాప్లో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తెచ్చేలా డీల్ కుదిరిందట.
లాక్ డౌన్ టైంలో ఎడిటింగ్ మీద ఎడిటింగ్ చేసి సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారని.. స్యూర్ షాట్ హిట్ అయ్యే సినిమా ఇదని.. ఈ సినిమాలో కొత్తదనం నచ్చి నెట్ ఫ్లిక్స్ వాళ్లు మంచి రేటుతో డిజిటల్ రైట్స్ తీసుకున్నారని అంటున్నారు. కాలం కలిసొస్తే సంక్రాంతికి.. లేదంటే ఆ తర్వాత థియేటర్లు 100 పర్సంట్ నడిచే సమయంలోనే ‘ఉప్పెన’ను విడుదల చేయాలన్నది మైత్రీ వాళ్ల ప్లాన్. ఈ సినిమా రిలీజవకముందే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేయడం విశేషం.
This post was last modified on December 17, 2020 4:43 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…