మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేస్తున్న కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. అతణ్ని హీరోగా పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉప్పెన’ అనే ఆసక్తికర ప్రేమకథను రూపొందించింది. కృతి శెట్టి అనే కొత్తమ్మాయి అతడితో జోడీ కట్టింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడు. ఈ సినిమాను ఏప్రిల్ 2నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ప్రణాళికల్ని దెబ్బ తీసింది.
మధ్యలో ఓటీటీల్లో కొత్త చిత్రాలు రిలీజయ్యే ట్రెండ్ మొదలయ్యాక.. ‘ఉప్పెన’ ఆ మీడియంలోనే రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. మైత్రీ వాళ్లకు మంచి మంచి ఆఫర్లే వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరోను ఓటీటీ ద్వారా అరంగేట్రం చేయించడం బాగుండదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఎంత ఆలస్యమైనప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయారు. కానీ ఆ టైం ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు.
ఇదిలా ఉండగా.. ‘ఉప్పెన’ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు తాజా సమాచారం. అలాగని ఈ సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం లాంటిదేమీ జరగదట. ముందు థియేటర్లలోనే రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్లో రిలీజవుతుందట. పాత పద్ధతిలోనే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలా రెండు నెలల గ్యాప్లో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తెచ్చేలా డీల్ కుదిరిందట.
లాక్ డౌన్ టైంలో ఎడిటింగ్ మీద ఎడిటింగ్ చేసి సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారని.. స్యూర్ షాట్ హిట్ అయ్యే సినిమా ఇదని.. ఈ సినిమాలో కొత్తదనం నచ్చి నెట్ ఫ్లిక్స్ వాళ్లు మంచి రేటుతో డిజిటల్ రైట్స్ తీసుకున్నారని అంటున్నారు. కాలం కలిసొస్తే సంక్రాంతికి.. లేదంటే ఆ తర్వాత థియేటర్లు 100 పర్సంట్ నడిచే సమయంలోనే ‘ఉప్పెన’ను విడుదల చేయాలన్నది మైత్రీ వాళ్ల ప్లాన్. ఈ సినిమా రిలీజవకముందే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేయడం విశేషం.
This post was last modified on December 17, 2020 4:43 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…