ఈ తరం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ల జాబితా తీస్తే.. సాయిపల్లవి, శ్రీలీల ముందు వరుసలో నిలుస్తారు. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టమే. ఎవరికి వారు సూపర్ డ్యాన్సర్లే. ఫిదా, మారి-2, లవ్ స్టోరి, తండేల్ లాంటి చిత్రాల్లో అద్భుతమైన నృత్యాలతో ఆకట్టుకుంది సాయిపల్లవి. శ్రీలీలేమో.. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘పెళ్ళిసందడి’లోనే అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది.
తర్వాత ప్రతి సినిమాలోనూ తన డ్యాన్సులతో కట్టిపడేస్తోంది శ్రీలీల. ‘కుర్చీ మడత పెట్టి’ పాటలో శ్రీలీల డ్యాన్స్ చూసి తన ఫ్యాన్ అయిపోయానని శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరో చెప్పడం విశేషం. ఇలా డ్యాన్సుల్లో ఎవరికి వారే సాటి అయిన సాయిపల్లవి, శ్రీలీల కలిసి.. ఒక పాటలో నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? డ్యాన్స్ లవర్స్కు అంతకంటే పండుగ ఇంకేముంటుంది?
త్వరలోనే ఈ అరుదైన కలయికను చూసే అవకాశం కనిపిస్తోంది. సాయిపల్లవి, శ్రీలీల తొలిసారిగా ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్లో ‘అమరన్’ దర్శకుడు రామ్ కుమార్ పెరియస్వామి రూపొందించబోతున్న సినిమాకు వీళ్లిద్దరే కథానాయికలుగా ఎంపికయ్యారు.
ధనుష్, సాయిపల్లవి ఇంతకుముందే ‘మారి-2’ చిత్రంలో రౌడీ బేబీ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారనగానే ‘రౌడీ బేబీ’ని మించిన డ్యాన్స్ నంబర్ ఆశిస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాకు శ్రీలీల కూడా తోడవడంతో ఈ ముగ్గురినీ కలిపి ఒక పాట పెడితే డ్యాన్స్ ఫ్లోర్ షేకైపోతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రామ్ కుమార్ ఎలాంటి కథ తీసినా.. నృత్యాల్లో సాయిపల్లవి, శ్రీలీలకు ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆ ఇద్దరి మీద ఒక డ్యాన్స్ నంబర్ పెడితే మాత్రం ఆ పాట సినిమాకే అతి పెద్ద ఆకర్షణగా నిలవడం ఖాయం. ప్రమోషన్ల పరంగా కూడా అది బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on February 4, 2026 12:26 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…