రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి లాంటి స్ట్రెయిట్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే విలక్షణతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం తన ప్రత్యేకత. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు అనిపించినా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా యమా బిజీ అయిపోయాడు.
సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై లాంటి ఓటిటి మూవీస్ మరింత పేరు తీసుకొచ్చాయి. రెగ్యులర్ గా వెబ్ కంటెంట్ లో కనిపించే మనోజ్ బాజ్ పాయ్ చేసిన కొత్త ఓటిటి మూవీ ఘుస్కోర్ పండత్. అంటే అర్థం లంచగొండి పండితుడు అని.
ఇప్పుడీ టైటిల్ వివాదాలకు దారి తీస్తోంది. ఒక సామజిక వర్గాన్ని అవమానపరిచేలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పేరు పెట్టారని, అదే వేరే కులాలకు మతాలకు ఆపాదించి ఎందుకు చేయరని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు నిలదీస్తున్నారు. సినిమాల్లో పాత్రలు అవినీతి చేయడం సహజమని, దాన్ని చూపించడం తప్పేమి కాదని, కానీ ఇలా టైటిల్ లో ఒక వర్గాన్ని అవమానపరిచేలా చేయడం తగదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ నిన్న విడుదల చేసిన టీజర్ లో ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనే హింట్ ఇచ్చారు. లంచాలకు మరిగిన ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ లో అన్నమాట.
ప్రస్తుతం ఈ కాంట్రవర్సి గురించి నెట్ ఫ్లిక్స్ స్పందించలేదు. టైటిల్ మాత్రం పెద్ద రచ్చే చేసేలా ఉంది. అయినా హీరో పాత్రను అలా సంబోధించడంలో తప్పు లేదు కానీ ఒక సామజిక వర్గం పవిత్రంగా భావించే ఇంటి పేరుని ఇలా కించపరిచేలా చేయడం మాత్రం సమర్ధించే విషయం కాదు.
త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న ఘుస్కోర్ పండత్ కు ఈ నిరసన సెగలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఒకవేళ ఎవరైనా కేసు వేస్తే స్ట్రీమింగ్ వాయిదా పడొచ్చు. థియేటర్ల దగ్గర అడ్డుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది కేవలం డిజిటల్ రిలీజ్ కోసం తీసిన ఓటిటి మూవీ కాబట్టి చట్టపరంగా మాత్రమే బ్రేక్ వేసే అవకాశముంది.
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…