భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సినిమా సంబంధాలు కూడా తెగిపోయాయి. ఒకప్పట్లా పాకిస్థాన్ నటీనటులు ఇండియాలో సినిమాలు చేయట్లేదు. అలాగే ఇండియన్ మూవీస్ పాకిస్థాన్లో రిలీజ్ కావట్లేదు.
ఐతే హిందీ సినిమాలకు బాగా అలవాటు పడ్డ పాకిస్థానీలు .. వాటిని ఏదో రకంగా చూడడానికే ప్రయత్నిస్తున్నారు. ఐతే వేరే సినిమాలు అంటే ఓకే కానీ.. పాకిస్థాన్, ఆ దేశీయులను విలన్గా చూపించిన సినిమాను ఎగబడి చూడడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. దురంధర్ సినిమా విషయంలో ఇదే జరిగింది.
పాకిస్థాన్లో ఈ సినిమా రిలీజ్ కాకపోయినా.. ఆన్ లైన్లో పైరసీ వెర్షన్ను పాకిస్థాన్లో పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుని చూసినట్లు వెల్లడైంది. ఒక డేటా ప్రకారం ఇప్పటిదాకా పాకిస్థాన్లో దురంధర్ పైరసీ వెర్షన్ డౌన్లోడ్లు 20 లక్షలు దాటిపోయాయని వార్తలు వచ్చాయి.
ఈ సినిమా పూర్తిగా పాక్కు వ్యతిరేకంగానే ఉంటుందీ. చిత్రం కథ అంతా కూడా పాకిస్థాన్ నేపథ్యంలోనే సాగుతుంది. అయినా సరే.. పాకిస్థానీలు ఈ సినిమాను పెద్ద ఎత్తున చూశారు, చూస్తూనే ఉన్నారు. ఇటీవలే దురంధర్ నెట్ఫ్లిక్స్ ద్వారా డిజిటల్గా రిలీజైంది. అప్పట్నుంచి పాకిస్థాన్లో నెట్ ఫ్లిక్స్ నంబర్వన్గా కొనసాగుతున్నది దురంధర్ మూవీనే. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని అక్కడి వాళ్లు ఎంతగా ఎగబడి చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
విశేషం ఏంటంటే.. పాకిస్థాన్లో నెట్ఫ్లిక్స్ నంబర్ 2 కూడా బాలీవుడ్ మూవీనే. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం తేరే ఇష్క్ మే.. దురంధర్ తర్వాతి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ డేటా చూసి పాకిస్థానీలకు బాలీవుడ్ సినిమాలే దిక్కు అని.. తమకు వ్యతిరేకంగా తీసిన సినిమాను కూడా ఈ స్థాయిలో ఆదరించడం వారికే చెల్లింది అంటూ భారత నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on February 3, 2026 9:14 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…