Movie News

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. పెర్ఫామెన్సులూ అదిరిపోతాయి. కానీ ఈషా రెబ్బాకు మాత్రం త్రివిక్ర‌మ్ అన్యాయం చేశాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. ఆమె సెకండ్ హీరోయిన్ అయి ఉంటుంద‌ని ఆశిస్తే.. పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌ను ఇచ్చాడు త్రివిక్ర‌మ్.

ఈషాకు పెర్ఫామ్ చేసే స్కోపే లేక‌పోయింది. ఈ పాత్ర విష‌యంలో ఇంత‌కుముందే ఈషా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. తాజాగా త‌న కొత్త సినిమా ఓం శాంతి శాంతి శాంతిః ప్రమోష‌న్ల‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అర‌వింద స‌మేత రిలీజ్ త‌ర్వాత త‌న పాత్ర విష‌యంలో వ‌చ్చిన స్పంద‌న చూసి బాధ ప‌డ్డ‌ట్లు వెల్ల‌డించింది ఈషా.

త్రివిక్ర‌మ్ సినిమాలు, వాటిలోని డైలాగ్స్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని..అర‌వింద స‌మేత క‌థ చెప్పినపుడు అందులో క‌చ్చితంగా న‌టించాల‌ని అనుకున్నాన‌ని ఈషా వెల్ల‌డించింది. ఐతే మొద‌ట్లో త‌న‌ది కూడా లీడ్ రోల్స్‌లో ఒక‌టి అనే చెప్పార‌ని ఆమె తెలిపింది. త‌న పాత్ర స్టీరియో టైప్ అవుతుందా అన్న భ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. రోజులు గ‌డిచేకొద్దీ ఆ భ‌యం పోయింద‌ని చెప్పింది. అర‌వింద స‌మేత‌ మేకింగ్ టైంలో.. అది పెద్ద సినిమా, పెద్ద ద‌ర్శ‌కుడు, పెద్ద నిర్మాణ సంస్థ కావ‌డంతో అంద‌రూ త‌న గురించి మాట్లాడుకునేవార‌ని.. అస‌లు తాను ఆ సినిమాలో ఉన్నానన్న‌ది నిజ‌మా కాదా అని న్యూస్‌లు ఇచ్చేవార‌ని ఆమె గుర్తు చేసుకుంది.

ఐతే సినిమా రిలీజ్ త‌ర్వాత చాలామంది ఫోన్ చేసి.. అన‌వ‌స‌రంగా ఈ పాత్ర చేశారు, ఏముంది ఇందులో అన‌డంతో తాను చాలా బాధ ప‌డ్డాన‌ని ఈషా చెప్పింది. నాకు క్యారెక్ట‌ర్లు చేయ‌డానికి ఇబ్బంది లేద‌ని.. కానీ అవి చేస్తూ పోతే, హీరోయిన్‌గా త‌న‌ను అంగీక‌రించ‌రేమో అని.. లీడ్ రోల్స్ చేయ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు ఈషా తెలిపింది. మ‌ల‌యాళ హిట్ జ‌య జ‌య జ‌య జ‌య‌హేకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషాకు జోడీగా త‌రుణ్ భాస్క‌ర్ న‌టించాడు. సజీవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Satya

Recent Posts

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

3 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

1 hour ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

1 hour ago

వదిలేయడమే అఖిల్ చేసుకున్న అదృష్టం

లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…

2 hours ago

వివేకాను చంపించింది జగనే: లోకేశ్

ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…

4 hours ago

రుక్మిణి వసంత్… ఇంకో మెగా మూవీలో?

‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…

4 hours ago