భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో కూడా కోహ్లీకి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాదాపు 270 మిలియన్ల ఫాలోవర్లతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అందులో ఒక్క ప్రమోషన్ పోస్ట్ ఖరీదు కొన్ని కోట్లు అనడంలో ఎటువంటి అనుమానం లేదు.
ఐతే శుక్రవారం అర్ధరాత్రి ఈ అకౌంట్ మాయం కావడంతో ఫాన్స్ అందరూ ఆందోళన చెందారు. విరాట్ అకౌంట్ కి ఏమైంది? తానే అకౌంట్ ను డిలీట్ చేశాడా అంటూ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించారు. ఒకవైపు అతని ట్విట్టర్ ఖాతా లోడ్ అవుతుండడం.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే లోడ్ అవ్వకపోవడంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు.
అక్కడితో ఆగకుండా విరాట్ భార్య, హీరోయిన్.. అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ, విరాట్ అకౌంట్ ఎందుకు కనిపించట్లేదు అని తనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సోషల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఈ వార్త మారు మోగిపోయింది.
తీరా చూస్తే కొన్ని గంటలకే విరాట్ అకౌంట్ తిరిగి ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షం అయ్యింది. దీంతో “అన్న తిరిగి వచ్చడ్రోయ్” అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఆందోళన చూసి చాలామందికి అతిశయోక్తి కలగక మానదు. కానీ వారి ఆందోళనకు ఒక కారణం ఉంది. ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా ఏమైనా పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్ లు డియాక్టివేట్ చెయ్యడం సెలబ్రిటీలకు ఒక అలవాటుగా మారిపోయింది.
మరోపక్క విరాట్ అకౌంట్ లో తమ వ్యాపార వాణిజ్యాలు ఉన్న సంస్థలు కూడా కాసేపు తీవ్ర ఆందోళనలు చెందాయి. కేవలం విరాట్ పోస్ట్ తో వ్యాపారాలు వేరే స్థాయికి వెళ్లిన దాఖలాలు ఎన్నో.
ఏదైతేనేం విరాట్ అకౌంట్ తిరిగిరావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇలాంటి వాటికి కూడా ఇంత గందరగోళం అవసరమా అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 30, 2026 9:13 am
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…