ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్. తొలి సినిమా వెళ్ళిపోమాకేలో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన అతను.. రెండో సినిమా ఫలక్నుమా దాస్కు ఎవ్వరూ ఊహించని మేకోవర్ ఇచ్చాడు. అగ్రెసివ్ క్యారెక్టర్లో చెలరేగిపోయి నటించాడు. ఈ సినిమాకు దర్శకుడు కూడా అతనే. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
తర్వాత ఈ నగరానికి ఏమైంది, హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి మెమరబుల్ మూవీస్ చేసిన విశ్వక్కు కొన్నేళ్లుగా సరైన సినిమాలు పడట్లేదు. ముఖ్యంగా విశ్వక్ చివరి చిత్రం లైలా దారుణమైన ఫలితాన్నందుకుంది.
గత కొన్నేళ్లలో తెలుగు కాస్త పేరున్న హీరోలు చేసిన సినిమాల్లో వరస్ట్ లిస్టు తీస్తే ఇది ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాతో విశ్వక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. లైలా తర్వాత ఇప్పటదాకా విశ్వక్ కొత్త సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడంతో దాని రిజల్ట్ గురించి మాట్లాడడానికి విశ్వక్కు ఛాన్స్ రాలేదు.
ఐతే తన కొత్త చిత్రం ఫంకీ వచ్చే నెల 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనుదీప్, హీరోయిన్ కాయదు లోహర్లతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన విశ్వక్.. లైలా ఫలితం గురించి స్పందించాడు. మామూలుగా తాను ఏ సినిమా చేసినా తన తల్లి తనను చూసి మురిసిపోతుందని.. యావరేజ్ చిత్రంలో నటించినా కూడా షో అయ్యాక తనను పట్టుకుని పొంగిపోతున్నట్లు మాట్లాడుతుందని.. కానీ లైలా మూవీ షో అయ్యాక మాత్రం ఆమె భిన్నంగా స్పందించిందని విశ్వక్ వెల్లడించాడు.
తనవైపు ఆమె కొన్ని క్షణాల పాటు జాలిగా చూసిందని.. దాన్ని బట్టే ఆ సినిమా రిజల్ట్ ఏంటో అర్థమైపోయిందని విశ్వక్ తెలిపాడు. ఇక మరో ప్రశ్నకు సమాధానంగా.. తన తల్లి చిన్నప్పటి నుంచి నువ్వు హీరోలా ఉన్నావు అనేదని, దాన్ని తాను సీరియస్గా తీసుకుని హీరో అయ్యానని విశ్వక్ చెప్పాడు.
గతంలో తన సినిమాలను ప్రమోట్ చేయడంలో భాగంగా కొంచెం హద్దులు దాటి ప్రవర్తించేవాడినని.. పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసేవాడినని.. ఇప్పుడు వయసు పెరిగి మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అలాంటివి చేయట్లేదని విశ్వక్ తెలిపాడు.
This post was last modified on January 26, 2026 9:06 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…