Movie News

ఇద్దరు టాలీవుడ్ దిగ్గజాలకు పద్మ శ్రీ

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ న్ కు పద్మ శ్రీ దక్కింది. ఇక, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, సీనియర్ నటుడు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ ను పద్మ శ్రీ వరించింది. కళల విభాగంలో వీరిద్దనీ పద్మ శ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

1973లో జగమే మాయ చిత్రంతో తెరంగేట్రం చేసిన మురళీ మోహన్ 350కి పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 1985లో ఓ తండ్రి తీర్పు చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2001లో ప్రేమించు చిత్రానికిగాను, 2003లో వేగు చుక్కలు చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు దక్కించుకున్నారు.

2017లో మురళీ మోహన్ ను సైమా జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ జయభేరి గ్రూప్ చైర్మన్ గా అతడు వంటి హిట్ చిత్రాలను అందించారు. సినీరంగానికి మురళీ మోహన్ చేసిన సేవలకుగాను కళల కేటగిరీ నుంచి ఆయనను పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.

ఇక, టాలీవుడ్ నట కిరీటిగా ప్రసిద్ధి కమెడియన్ గా రాజేంద్ర ప్రసాద్ విశేష సేవలందించారు. 1981లో అన్న ఎన్టీఆర్ పిలుపుతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ 200కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1991లో ఎర్రమందారం చిత్రానికి, 2004లో ఆ నలుగురు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రాజేంద్ర ప్రసాద్ నంది అవార్డు అందుకున్నారు. 1994లో మేడం చిత్రానికి గాను నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు, 2014లో టామీ చిత్రానికిగానూ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా నంది అవార్డు దక్కించుకున్నారు.

వీటితోపాటు 3 సైమా అవార్డులు, 3 సంతోషం ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. ఈ తరం నటులతో పోటీపడి మరీ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను రాజేంద్రప్రసాద్ ఇంకా అలరిస్తూనే ఉన్నారు.

Kumar

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

1 hour ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

3 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

5 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago