Movie News

ఆనంద్ బయోపిక్.. క్రేజీ అప్‌డేట్


ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్‌కు మంచి డిమాండ్ ఉంటోంది కొన్నేళ్లుగా. బాగ్ మిల్కా బాగ్, మేరీకోమ్, ఎం.ఎస్.ధోని లాంటి సినిమాలు మంచి ఆదరణ సంపాదించుకున్నాయి ఈ కోవలో. ప్రస్తుతం వివిధ భాషల్లో స్పోర్ట్స్ బయోపిక్స్ చాలానే ప్రతిపాదనల దశలో ఉన్నాయి. సైనా, సింధు, సానియా లాంటి క్రీడాకారిణుల జీవితాల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా దేశం గర్వించదగ్గ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథను తెరకెక్కించనున్నట్లు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఐతే ఆనంద్ పాత్రను పోషించేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెంటనే లభించలేదు. ఆనంద్ తమిళుడు కాబట్టి ఓ తమిళుడు అయితేనే ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐతే ఇంకా బయటికి వెళ్లడించకపోయినప్పటికీ.. ఆనంద్ పాత్ర కోసం ఇప్పటికే ఆనంద్ ఎల్.రాయ్ ఓ నటుడిని ఓకే చేసేసినట్లు సమాచారం. ఆ నటుడెవరో కాదు.. తమిళ స్టార్ ధనుష్ అట. ఈ విలక్షణ నటుడిపై ఆనంద్ ఎల్.రాయ్‌కు మంచి గురే ఉంది. అతడిని హీరోగా పెట్టి హిందీలో ‘రాన్‌జానా’ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్‌లతో పాటు ధనుష్‌ను పెట్టి ‘ఆత్రంగి’ అనే బాలీవుడ్ మూవీ తీస్తున్నాడు. ధనుష్ అసాధారణ నటుడంటూ ప్రశంసలు కురిపించే ఆనంద్.. అతడినే విశ్వనాథన్ ఆనంద్ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.

పాత్రకు తగ్గట్లు అవతారం మార్చుకుని, అద్భుతంగా నటించడంలో ధనుష్ ప్రత్యేకతే వేరు. ఆనంద్ రూపంలోకి రావడానికి అతను కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆనంద్ కొంచెం నిండైన మనిషిలా కనిపిస్తాడు. ధనుష్ మరీ బక్క పలచగా ఉంటాడు. కాబట్టి కొంచెం ఒళ్లు చేయాలి. చెస్ క్రీడాకారుడి మానసిక స్థితిని, హావభావాలను ఒడిసిపట్టుకోవాలి. మరి ఆనంద్ పాత్ర కోసం ధనుష్ ఎలాంటి మేకోవర్ సాధిస్తాడో చూడాలి.

This post was last modified on December 15, 2020 3:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

1 hour ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

2 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

2 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

3 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

4 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

5 hours ago