ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్కు మంచి డిమాండ్ ఉంటోంది కొన్నేళ్లుగా. బాగ్ మిల్కా బాగ్, మేరీకోమ్, ఎం.ఎస్.ధోని లాంటి సినిమాలు మంచి ఆదరణ సంపాదించుకున్నాయి ఈ కోవలో. ప్రస్తుతం వివిధ భాషల్లో స్పోర్ట్స్ బయోపిక్స్ చాలానే ప్రతిపాదనల దశలో ఉన్నాయి. సైనా, సింధు, సానియా లాంటి క్రీడాకారిణుల జీవితాల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా దేశం గర్వించదగ్గ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథను తెరకెక్కించనున్నట్లు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఐతే ఆనంద్ పాత్రను పోషించేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెంటనే లభించలేదు. ఆనంద్ తమిళుడు కాబట్టి ఓ తమిళుడు అయితేనే ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐతే ఇంకా బయటికి వెళ్లడించకపోయినప్పటికీ.. ఆనంద్ పాత్ర కోసం ఇప్పటికే ఆనంద్ ఎల్.రాయ్ ఓ నటుడిని ఓకే చేసేసినట్లు సమాచారం. ఆ నటుడెవరో కాదు.. తమిళ స్టార్ ధనుష్ అట. ఈ విలక్షణ నటుడిపై ఆనంద్ ఎల్.రాయ్కు మంచి గురే ఉంది. అతడిని హీరోగా పెట్టి హిందీలో ‘రాన్జానా’ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్లతో పాటు ధనుష్ను పెట్టి ‘ఆత్రంగి’ అనే బాలీవుడ్ మూవీ తీస్తున్నాడు. ధనుష్ అసాధారణ నటుడంటూ ప్రశంసలు కురిపించే ఆనంద్.. అతడినే విశ్వనాథన్ ఆనంద్ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.
పాత్రకు తగ్గట్లు అవతారం మార్చుకుని, అద్భుతంగా నటించడంలో ధనుష్ ప్రత్యేకతే వేరు. ఆనంద్ రూపంలోకి రావడానికి అతను కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆనంద్ కొంచెం నిండైన మనిషిలా కనిపిస్తాడు. ధనుష్ మరీ బక్క పలచగా ఉంటాడు. కాబట్టి కొంచెం ఒళ్లు చేయాలి. చెస్ క్రీడాకారుడి మానసిక స్థితిని, హావభావాలను ఒడిసిపట్టుకోవాలి. మరి ఆనంద్ పాత్ర కోసం ధనుష్ ఎలాంటి మేకోవర్ సాధిస్తాడో చూడాలి.
This post was last modified on December 15, 2020 3:16 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…