మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. 90వ దశకంలోనే ఆయన స్వాతికిరణం లాంటి కల్ట్ మూవీలో నటించి తెలుగు ఆడియన్సుని మైమరిపించారు. తమిళ అనువాదం దళపతితోనూ తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు. ఇక కొత్త తరం తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయమైంది యాత్ర సినిమా ద్వారా.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన ఈ సినిమాపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ.. వైఎస్ పాత్రకు మమ్ముట్టి పూర్తి న్యాయం చేశారనడంలో సందేహం లేదు. యాత్ర-2లోనూ ఆయన కొన్ని సన్నివేశాల్లో మెరిశారు. విశేషం ఏంటంటే.. ఇప్పుడు మమ్ముట్టి మలయాళంలో పాదయాత్ర పేరుతో ఇంకో సినిమా చేస్తుండడం విశేషం. తెలుగులో చేసిన యాత్రకు, దీనికి ఏం సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ పాదయాత్ర అని టైటిల్ పెట్టుకోవడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఆ సినిమాపై పడింది.
ఈ మధ్యే కలంకవల్ అనే సినిమాతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చారు మమ్ముట్టి.. మలయాళ సినీ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైన మమ్ముట్టి.. ఇందులో సైకో కిల్లర్గా విలన్ పాత్రను పోషించాడు. ఆ సినిమాను తన సొంత బేనర్ మమ్ముట్టి కంపెనీలో నిర్మించడం విశేషం. ఇప్పుడు పాదయాత్రను సైతం ఆ బేనర్లోనే చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. దీన్ని లెజెండరీ డైరెక్టర్ ఆదూర్ గోపాలకృష్ణన్ రూపొందించనున్నాడు.
మమ్మట్టితో 32 ఏళ్ల కిందట ఆయన విధేయన్ అనే క్లాసిక్ తీశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రానుండడంతో అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలు చేయని ఆదూర్.. వయసు ప్రభావం రీత్యా ఇక డైరెక్ట్ చేయరనే అంతా అనుకున్నారు. కానీ 84 ఏళ్ల వయసులో ఈ దిగ్దర్శకుడు మమ్ముట్టితో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. బహుశా మరో గొప్ప సినిమా తీసి రిటైరవ్వాలని అనుకుంటున్నారేమో. మరి మమ్ముట్టితో ఈసారి ఆయన ఎలాంటి కళాఖండాన్ని తీస్తారో చూడాలి.
This post was last modified on January 23, 2026 11:34 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…