‘నారీ నారీ నడుమ మురారి’ ఇటు హీరో శర్వానంద్కు, అటు నిర్మాత అనిల్ సుంకరకు ఎంతో కీలకమైన చిత్రం. శర్వా నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. మరోవైపు అనిల్.. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ లాంటి డిజాస్టర్లతో కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో ‘నారీ నారీ నడుమ మురారి’ మీద చాలా ఆశలు పెట్టుకున్నారిద్దరూ. సంక్రాంతికి పెద్దగా ప్రచారం లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. వారి ఆశలను నిలబెడుతూ సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ నేపథ్యంలో శర్వా, అనిల్ అమితానందానికి గురయ్యారు. ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ మీట్లో ఇద్దరూ ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. ముఖ్యంగా శర్వా మాట్లాడుతూ.. తన కంటే కూడా అనిల్కు ఈ సక్సెస్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఆయనతో ఇక ముందూ తన ప్రయాణం కొనసాగుతుందని.. అనిల్తో చేసే తర్వాతి సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేస్తానని చెప్పడం విశేషం.
‘‘ఈ సినిమా విజయం మొత్తానికి కారణమైన వ్యక్తి అనిల్ గారు. కానీ ఆయన్ని అనిల్ గారు అనేకంటే అన్నగారు అని పిలవాలనిపిస్తుంది. ఆయనకు థ్యాంక్స్ అని చెబితే అది చాలా చిన్న పదం అవుతుంది. థ్యాంక్స్ చెప్పి ఇక్కడితో రుణం తీర్చుకోదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. హీరో, ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అన్నది మేం చూపిస్తాం. ఈ రోజు హామీ ఇస్తున్నా. తర్వాతి సినిమాకు రూపాయి కూడా అడగను. మళ్లీ అనిల్ గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నా’’ అంటూ అనిల్ను కౌగిలించుకున్నాడు శర్వా.
తాను ఏడేళ్ల నుంచి కష్టపడుతున్నామని, హిట్టు విలువ ఏంటో తమకు తెలుసని.. ఆ హిట్టు తనకు అనిల్ ఇచ్చారని శర్వా వ్యాఖ్యానించాడు. దీనికి బదులుగా అనిల్.. మీరే నాకు హిట్ ఇచ్చారనడంతో అందరం, అందరికీ ఇచ్చామని వర్వా అన్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’లో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.
This post was last modified on January 23, 2026 12:45 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…