నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. 2021లో విడుదలయ్యాక మళ్ళీ దీన్ని థియేటర్లకు తీసుకురాలేదు. అయిదు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులకు మరోసారి చూపించబోతున్నారు.
అయితే పది ఇరవయ్యేళ్ళ పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఓకే కానీ లవ్ స్టోరీ చాలా మంది మూవీ లవర్స్ కి ఇంకా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకొంచెం ఆగి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. కానీ నిర్మాతల ఆలోచన వేరేలా కనిపిస్తోంది. ఒక పాజిటివ్ యాంగిల్ గమనించవచ్చు.
సంక్రాంతి హడావిడి అయిపోయాక బాక్సాఫీస్ కు కొత్త ఆప్షన్లు లేకుండా పోయాయి. దీంతో నెలాఖరు వరకు వాటితోనే సర్దుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు లవ్ స్టోరీ వచ్చే దాకా సిచువేషన్ కొంచెం డ్రైగానే ఉంటుంది. సో ఈ సీజన్ వాడుకోవచ్చు. ముఖ్యంగా వాలెంటైన్ డే రోజు ప్రేమికులు తమ ఫస్ట్ ఛాయస్ గా లవ్ స్టోరీని పెట్టుకునే అవకాశం లేకపోలేదు.
అయితే అదే రోజు రామ్ చరణ్ ఆరంజ్ మళ్ళీ తీసుకొస్తున్న సందర్భంగా రెండింటి మధ్య క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి. ఆరంజ్ ఆల్రెడీ ఒకటి రెండ్లు బాగా ఆడేసి వెళ్ళిపోయింది. ముచ్చటగా మరోసారి చూపించేందుకు నాగబాబు రెడీ అయ్యారు.
తండేల్ తర్వాత చైతు ఆల్రెడీ ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. వృషకర్మ ఇంకా విడుదల డేట్ ఫిక్స్ కాలేదు. సో తనను తెరమీద సెలెబ్రేట్ చేసుకోవాలనుకునే ఫ్యాన్స్ కి లవ్ స్టోరీ మంచి ఆప్షన్ అవుతుంది. నిజానికి వాళ్ళు ముందు నుంచి డిమాండ్ చేస్తోంది జోష్ ని. అయితే నిర్మాత దిల్ రాజు దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈలోగా లవ్ స్టోరీ ఈ రకంగా అవకాశాన్ని వాడుకుంటోంది. చైతునే కాదు సాయిపల్లవి ఫ్యాన్స్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు. ముఖ్యంగా సారంగదరియా పాట థియేటర్లలో మోగిపోవడం ఖాయం. నారంగ్ ఫ్యామిలీ ప్రమోషన్లను కొత్త సినిమా రేంజ్ లో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందట.
This post was last modified on January 22, 2026 5:25 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…