నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. 2021లో విడుదలయ్యాక మళ్ళీ దీన్ని థియేటర్లకు తీసుకురాలేదు. అయిదు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులకు మరోసారి చూపించబోతున్నారు.
అయితే పది ఇరవయ్యేళ్ళ పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఓకే కానీ లవ్ స్టోరీ చాలా మంది మూవీ లవర్స్ కి ఇంకా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకొంచెం ఆగి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. కానీ నిర్మాతల ఆలోచన వేరేలా కనిపిస్తోంది. ఒక పాజిటివ్ యాంగిల్ గమనించవచ్చు.
సంక్రాంతి హడావిడి అయిపోయాక బాక్సాఫీస్ కు కొత్త ఆప్షన్లు లేకుండా పోయాయి. దీంతో నెలాఖరు వరకు వాటితోనే సర్దుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు లవ్ స్టోరీ వచ్చే దాకా సిచువేషన్ కొంచెం డ్రైగానే ఉంటుంది. సో ఈ సీజన్ వాడుకోవచ్చు. ముఖ్యంగా వాలెంటైన్ డే రోజు ప్రేమికులు తమ ఫస్ట్ ఛాయస్ గా లవ్ స్టోరీని పెట్టుకునే అవకాశం లేకపోలేదు.
అయితే అదే రోజు రామ్ చరణ్ ఆరంజ్ మళ్ళీ తీసుకొస్తున్న సందర్భంగా రెండింటి మధ్య క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి. ఆరంజ్ ఆల్రెడీ ఒకటి రెండ్లు బాగా ఆడేసి వెళ్ళిపోయింది. ముచ్చటగా మరోసారి చూపించేందుకు నాగబాబు రెడీ అయ్యారు.
తండేల్ తర్వాత చైతు ఆల్రెడీ ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. వృషకర్మ ఇంకా విడుదల డేట్ ఫిక్స్ కాలేదు. సో తనను తెరమీద సెలెబ్రేట్ చేసుకోవాలనుకునే ఫ్యాన్స్ కి లవ్ స్టోరీ మంచి ఆప్షన్ అవుతుంది. నిజానికి వాళ్ళు ముందు నుంచి డిమాండ్ చేస్తోంది జోష్ ని. అయితే నిర్మాత దిల్ రాజు దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈలోగా లవ్ స్టోరీ ఈ రకంగా అవకాశాన్ని వాడుకుంటోంది. చైతునే కాదు సాయిపల్లవి ఫ్యాన్స్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు. ముఖ్యంగా సారంగదరియా పాట థియేటర్లలో మోగిపోవడం ఖాయం. నారంగ్ ఫ్యామిలీ ప్రమోషన్లను కొత్త సినిమా రేంజ్ లో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందట.
This post was last modified on January 22, 2026 5:25 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…