టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వంద కోట్లు, రెండు వందల కోట్ల పోస్టర్ల హడావుడే కనిపిస్తోంది. సినిమా రిజల్ట్ కంటే బాక్సాఫీస్ అంకెలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ టైమ్లో, శర్వానంద్ రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు రియాల్టీని కుండబద్దలు కొట్టారు.
తన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ కి సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కలెక్షన్ల లెక్కల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని, ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ని కూడా ఆ అంకెలు అడగలేదని షాకింగ్ క్లారిటీ ఇచ్చారు.
శర్వా పాయింట్ ఏంటంటే.. సినిమా బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు, అది హౌస్ఫుల్ బోర్డుల రూపంలో కనిపిస్తుంది. షోలు పెంచిన పది నిమిషాలకే టికెట్లు అయిపోతున్నప్పుడు, ఇక మనకి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ అంకెలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన ఫిక్స్ అయిపోయారు. “శతమానం భవతి సినిమా టైమ్లోనే ఐదారేళ్ల క్రితమే మేము వంద కోట్ల క్లబ్ చర్చలు పక్కన పెట్టేశాం” అని శర్వా అనడం ఇండస్ట్రీలోని అంకెల పిచ్చికి ఒక గట్టి కౌంటర్ అని చెప్పాలి.
నిజానికి ఇవాళ రేపు ప్రమోషన్స్ కోసం తప్పుడు లెక్కలు వేయడం.. లేదంటే ఉన్నదాని కంటే ఎక్కువ చూపించడం కామన్ అయిపోయింది. కానీ శర్వా మాత్రం కంటెంట్ను నమ్ముకుంటే చాలు, ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే అసలైన వసూళ్లు అని నమ్ముతున్నారు. జనాల్లో కనిపిస్తున్న ఆ పాజిటివ్ వైబ్ ముందు ఈ అంకెలు చాలా చిన్నవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నేటి తరం హీరోలకు శర్వా ఒక కొత్త రూట్ చూపించినట్లయింది.
శర్వానంద్ రియాలిటీ అటిట్యూడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంకెలు ముఖ్యం కాదు, ఆడియన్స్ ఇచ్చే సాటిస్ఫ్యాక్షన్ ముఖ్యం అనే ఆయన ఫిలాసఫీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సంక్రాంతి రేసులో తన సినిమా క్లీన్ హిట్ అయినప్పటికీ, ఆయన ఎక్కడా ఓవర్ బిల్డప్ ఇవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఈ విషయాన్ని తేల్చేశారు.
This post was last modified on January 22, 2026 11:13 am
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…