టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వంద కోట్లు, రెండు వందల కోట్ల పోస్టర్ల హడావుడే కనిపిస్తోంది. సినిమా రిజల్ట్ కంటే బాక్సాఫీస్ అంకెలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ టైమ్లో, శర్వానంద్ రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు రియాల్టీని కుండబద్దలు కొట్టారు.
తన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ కి సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కలెక్షన్ల లెక్కల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని, ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ని కూడా ఆ అంకెలు అడగలేదని షాకింగ్ క్లారిటీ ఇచ్చారు.
శర్వా పాయింట్ ఏంటంటే.. సినిమా బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు, అది హౌస్ఫుల్ బోర్డుల రూపంలో కనిపిస్తుంది. షోలు పెంచిన పది నిమిషాలకే టికెట్లు అయిపోతున్నప్పుడు, ఇక మనకి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ అంకెలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన ఫిక్స్ అయిపోయారు. “శతమానం భవతి సినిమా టైమ్లోనే ఐదారేళ్ల క్రితమే మేము వంద కోట్ల క్లబ్ చర్చలు పక్కన పెట్టేశాం” అని శర్వా అనడం ఇండస్ట్రీలోని అంకెల పిచ్చికి ఒక గట్టి కౌంటర్ అని చెప్పాలి.
నిజానికి ఇవాళ రేపు ప్రమోషన్స్ కోసం తప్పుడు లెక్కలు వేయడం.. లేదంటే ఉన్నదాని కంటే ఎక్కువ చూపించడం కామన్ అయిపోయింది. కానీ శర్వా మాత్రం కంటెంట్ను నమ్ముకుంటే చాలు, ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే అసలైన వసూళ్లు అని నమ్ముతున్నారు. జనాల్లో కనిపిస్తున్న ఆ పాజిటివ్ వైబ్ ముందు ఈ అంకెలు చాలా చిన్నవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నేటి తరం హీరోలకు శర్వా ఒక కొత్త రూట్ చూపించినట్లయింది.
శర్వానంద్ రియాలిటీ అటిట్యూడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంకెలు ముఖ్యం కాదు, ఆడియన్స్ ఇచ్చే సాటిస్ఫ్యాక్షన్ ముఖ్యం అనే ఆయన ఫిలాసఫీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సంక్రాంతి రేసులో తన సినిమా క్లీన్ హిట్ అయినప్పటికీ, ఆయన ఎక్కడా ఓవర్ బిల్డప్ ఇవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఈ విషయాన్ని తేల్చేశారు.
This post was last modified on January 22, 2026 11:13 am
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…