యుత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్కు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక ముఖ్యమైన క్లారిటీ ఇచ్చారు. ఈ గ్యాంగ్లో ఒకరైన నటుడు సుశాంత్ రెడ్డి పార్ట్ 2లో భాగం కావడం లేదని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్ల సుశాంత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది తనను ఎంతో బాధించిందని తరుణ్ ఎమోషనల్ అయ్యారు.
సుశాంత్ లేడని తెలిసినప్పుడు తాను కొంత కాలం షాక్లోకి వెళ్ళానని, అసలు ఈ సినిమా చేయాలా వద్దా అని కూడా ఆలోచించినట్లు తరుణ్ చెప్పుకొచ్చారు. కేవలం డబ్బు కోసం సినిమా తీయడం తనకిష్టం లేదని, కథలో ఆ ఫ్రెండ్షిప్ వైబ్ పర్ఫెక్ట్గా కుదిరితేనే ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే స్క్రిప్ట్ను మళ్ళీ విశ్లేషించుకున్నాక, కార్తీక్ పాత్రను మరో కోణంలో చూపిస్తూ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు చెప్పారు.
సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, సినిమాలో కార్తీక్ పాత్ర మాత్రం ఉంటుందని తరుణ్ హింట్ ఇచ్చారు. బహుశా ఆ పాత్రను వేరే నటుడితో రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. “కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు, ద బాయ్స్ మళ్ళీ వస్తున్నారు” అంటూ ఆయన తన టీమ్ మీద ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతోందని, ఆడియన్స్ ఆశించే అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఒక స్నేహితుడు ఇచ్చే వెచ్చని కౌగిలింతలా చాలా నిజాయితీగా ఉంటుందని తరుణ్ ప్రామిస్ చేస్తున్నారు. సుశాంత్ లేని లోటు కనిపిస్తున్నా, తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్ మీద ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమాలోని ఆ ఎమోషనల్ క్యారెక్టర్ ను బ్యాలెన్స్ చేసే నటుడు ఎవరౌతారో చూడాలి.
This post was last modified on January 22, 2026 9:17 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…