యుత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్కు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక ముఖ్యమైన క్లారిటీ ఇచ్చారు. ఈ గ్యాంగ్లో ఒకరైన నటుడు సుశాంత్ రెడ్డి పార్ట్ 2లో భాగం కావడం లేదని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్ల సుశాంత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది తనను ఎంతో బాధించిందని తరుణ్ ఎమోషనల్ అయ్యారు.
సుశాంత్ లేడని తెలిసినప్పుడు తాను కొంత కాలం షాక్లోకి వెళ్ళానని, అసలు ఈ సినిమా చేయాలా వద్దా అని కూడా ఆలోచించినట్లు తరుణ్ చెప్పుకొచ్చారు. కేవలం డబ్బు కోసం సినిమా తీయడం తనకిష్టం లేదని, కథలో ఆ ఫ్రెండ్షిప్ వైబ్ పర్ఫెక్ట్గా కుదిరితేనే ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే స్క్రిప్ట్ను మళ్ళీ విశ్లేషించుకున్నాక, కార్తీక్ పాత్రను మరో కోణంలో చూపిస్తూ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు చెప్పారు.
సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, సినిమాలో కార్తీక్ పాత్ర మాత్రం ఉంటుందని తరుణ్ హింట్ ఇచ్చారు. బహుశా ఆ పాత్రను వేరే నటుడితో రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. “కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు, ద బాయ్స్ మళ్ళీ వస్తున్నారు” అంటూ ఆయన తన టీమ్ మీద ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతోందని, ఆడియన్స్ ఆశించే అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఒక స్నేహితుడు ఇచ్చే వెచ్చని కౌగిలింతలా చాలా నిజాయితీగా ఉంటుందని తరుణ్ ప్రామిస్ చేస్తున్నారు. సుశాంత్ లేని లోటు కనిపిస్తున్నా, తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్ మీద ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమాలోని ఆ ఎమోషనల్ క్యారెక్టర్ ను బ్యాలెన్స్ చేసే నటుడు ఎవరౌతారో చూడాలి.
This post was last modified on January 22, 2026 9:17 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…