వెంకీ రెమ్యునరేషన్‌పై నిర్మాత క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విక్టరీ వెంకటేష్ చేసిన ‘వెంకీ గౌడ’ క్యారెక్టర్ థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. ఆయన ఎంట్రీ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్ళిందని ఆడియన్స్ ఫీలవుతున్నారు. అయితే ఇంతటి క్రేజీ మల్టీస్టారర్ మూమెంట్ కోసం వెంకటేష్ గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల అంకెలు వినిపించాయి. దీనిపై నిర్మాత సుస్మిత కొణిదెల తన రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పారు.

నిజానికి వెంకటేష్ గారి లాంటి స్టార్ హీరో ఒక చిన్న గెస్ట్ రోల్ లేదా స్పెషల్ అప్పియరెన్స్ చేసినప్పుడు భారీగా డిమాండ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో తన ఫ్రెండ్‌షిప్ కోసం చాలా తక్కువ పారితోషికానికే వర్క్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. దీనిపై సుస్మిత నేరుగా అంకెలు చెప్పనప్పటికీ, “వెంకటేష్ గారు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వారు, ఆయన అడిగింది మేము ఇచ్చాం.. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ లో ఉండటం అమూల్యమైనది” అని బ్యాలెన్స్‌డ్ గా సమాధానం ఇచ్చారు.

ముందుగా ఈ రోల్ కోసం వెంకటేష్ గారిని సంప్రదించినప్పుడు అస్సలు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సుస్మిత వెల్లడించారు. చిరంజీవి గారితో ఉన్న వ్యక్తిగత అనుబంధం కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నచ్చి ఆయన వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆయన చాలా పెద్ద మనసు చూపించారని సుస్మిత పేర్కొన్నారు. అడిగిన పారితోషికం కంటే, సినిమా సక్సెస్ లో ఆయన భాగస్వామ్యం అవ్వడమే తమకు పెద్ద గిఫ్ట్ అని ఆమె అన్నారు.

ఇక అనిల్ రావిపూడి కూడా వెంకీ గారి పాత్రను డిజైన్ చేసిన విధానం, దానికి ఆయన ప్రాణం పోసిన తీరు అద్భుతమని సుస్మిత కొనియాడారు. డబ్బు కోసం కాకుండా, కేవలం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి ఒక బిగ్ మూమెంట్ క్రియేట్ చేయాలన్నదే తమ ఉద్దేశమని ఆమె క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి రెమ్యునరేషన్ కంటే సినిమా రిజల్ట్ ముఖ్యం అని భావించి వెంకటేష్ గారు ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారని అర్ధమవుతుంది.