జనవరిలో సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాత చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నెలాఖరు వరకు జనాలకు ఇతర ఆప్షన్లు పెద్దగా లేవు. చివరి వారంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి తప్ప వేరే నోటెడ్ మూవీస్ లేవు. అందుకే ఇప్పుడు ఫిబ్రవరి మీద అందరి దృష్టి వెళ్తోంది.
వాటిలో చెప్పుకోదగినది విశ్వక్ సేన్ ఫంకీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 13 రిలీజ్ ఉందంటూ ఇటీవలే పోస్టర్ ఒకటి ఆన్ లైన్ లో వదిలారు. సో వాయిదా ప్రసక్తే లేదు.
విశ్వక్ సేన్ కు ఫంకీ చాలా కీలకం. ఎందుకంటే గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో లైలా చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదురుకున్నాడు. కామెడీ పేరుతో ఒక పిచ్చి కంటెంట్ వదిలారని క్రిటిక్స్ గట్టిగా తలంటారు. ఆడియన్స్ రిజక్ట్ చేశారు. దీంతో బయట కనిపించడం కూడా మానేసి విశ్వక్ పూర్తిగా ఫంకీకే అంకింతమైపోయాడు.
సౌండ్ చేయకుండా లెగసి అనే మరో పొలిటికల్ థ్రిల్లర్ స్టార్ట్ చేసి దాన్ని కూడా సగానికి పైగా పూర్తి చేశాడు. ఏదైనా సరే సక్సెస్ కొట్టిన తర్వాతే బయటికి రావాలని డిసైడ్ అయిన విశ్వక్ దానికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు విడుదల టైం వచ్చేసింది.
దర్శకుడు అనుదీప్ జాతిరత్నాలుతో సెన్సేషన్ సృష్టించాక శివ కార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత రవితేజతో సినిమా ఓకే అనుకున్న స్టేజి దగ్గర చేజారింది. అదే కథనే విశ్వక్ సేన్ తో ఫంకీగా తీశాడని ఇన్ సైడ్ టాక్.
ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో నిజ జీవిత దర్శకుడిగా విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ మూవీ మొత్తం ఫన్ జోన్ లోనే ఉంటుందట. అయితే రిలీజ్ కు కేవలం పాతిక రోజులు కూడా లేని నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాలి. మరుసటి రోజు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన సీత పయనం, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ రిలీజవుతున్నాయి. సో ఫంకీ త్వరగా క్రాంకీ మూడ్ లోకి వచ్చేయాలి.
This post was last modified on January 21, 2026 11:07 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…