కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు. నాని, వెంకటేష్, గోపీచంద్ లాంటి హీరోలతో ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమాలు తీశాడు. అలాంటి ట్రాక్ రికార్డున్న అతడికి ఒకేసారి ప్రభాస్తో రూ.400 కోట్ల సినిమా చేసే అవకాశం దక్కింది.
ఐతే వీరి కలయికలో వచ్చిన రాజాసాబ్ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరిగా ఆడిందంతే. ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయిన మారుతి.. తన తర్వాతి చిత్రాన్ని ఎవరితో చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఐతే మెగా హీరో వరుణ్ తేజ్తో మారుతి సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం మొదలైంది. వీరి కలయికలో కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని మారుతి సన్నిహిత వర్గాలు ఖండించాయి.
మారుతి కొత్త సినిమా గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. తన తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు సన్నిహితులు. బహుశా మారుతి ఇంకా తన కొత్త సినిమాకు కథ రెడీ చేసి ఉండకపోవచ్చు. స్క్రిప్టు రెడీ అయ్యాకే దానికి తగ్గ హీరోను ఎంచుకోవాలని భావిస్తుండొచ్చు.
రాజాసాబ్ లాంటి భారీ చిత్రం తర్వాత మళ్లీ పెద్ద సినిమానే తీయాలనేమీ తాను ఫిక్స్ కాలేదని.. ఆ సమయంలో ఏ కథ కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని.. చిన్న సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమే అని మారుతి ఇంతకుముందు స్పష్టం చేశాడు. ఇప్పుడతను బలమైన స్క్రిప్టుతో రంగంలోకి దిగాల్సిందే.
మారుతి బలం కామెడీ. కానీ రాజాసాబ్లో ఆ బలాన్ని అతను చూపించలేకపోయాడు. ఫస్టాఫ్లో కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సినిమా దెబ్బ తింది. కాబట్టి ఈసారి తన ఫన్ పవర్ చూపించి మంచి ఎంటర్టైనర్తో ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి. అతడి కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on January 20, 2026 8:23 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…