కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు. నాని, వెంకటేష్, గోపీచంద్ లాంటి హీరోలతో ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమాలు తీశాడు. అలాంటి ట్రాక్ రికార్డున్న అతడికి ఒకేసారి ప్రభాస్తో రూ.400 కోట్ల సినిమా చేసే అవకాశం దక్కింది.
ఐతే వీరి కలయికలో వచ్చిన రాజాసాబ్ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరిగా ఆడిందంతే. ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయిన మారుతి.. తన తర్వాతి చిత్రాన్ని ఎవరితో చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఐతే మెగా హీరో వరుణ్ తేజ్తో మారుతి సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం మొదలైంది. వీరి కలయికలో కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని మారుతి సన్నిహిత వర్గాలు ఖండించాయి.
మారుతి కొత్త సినిమా గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. తన తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు సన్నిహితులు. బహుశా మారుతి ఇంకా తన కొత్త సినిమాకు కథ రెడీ చేసి ఉండకపోవచ్చు. స్క్రిప్టు రెడీ అయ్యాకే దానికి తగ్గ హీరోను ఎంచుకోవాలని భావిస్తుండొచ్చు.
రాజాసాబ్ లాంటి భారీ చిత్రం తర్వాత మళ్లీ పెద్ద సినిమానే తీయాలనేమీ తాను ఫిక్స్ కాలేదని.. ఆ సమయంలో ఏ కథ కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని.. చిన్న సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమే అని మారుతి ఇంతకుముందు స్పష్టం చేశాడు. ఇప్పుడతను బలమైన స్క్రిప్టుతో రంగంలోకి దిగాల్సిందే.
మారుతి బలం కామెడీ. కానీ రాజాసాబ్లో ఆ బలాన్ని అతను చూపించలేకపోయాడు. ఫస్టాఫ్లో కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సినిమా దెబ్బ తింది. కాబట్టి ఈసారి తన ఫన్ పవర్ చూపించి మంచి ఎంటర్టైనర్తో ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి. అతడి కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on January 20, 2026 8:23 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…