కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు. నాని, వెంకటేష్, గోపీచంద్ లాంటి హీరోలతో ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమాలు తీశాడు. అలాంటి ట్రాక్ రికార్డున్న అతడికి ఒకేసారి ప్రభాస్తో రూ.400 కోట్ల సినిమా చేసే అవకాశం దక్కింది.
ఐతే వీరి కలయికలో వచ్చిన రాజాసాబ్ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరిగా ఆడిందంతే. ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయిన మారుతి.. తన తర్వాతి చిత్రాన్ని ఎవరితో చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఐతే మెగా హీరో వరుణ్ తేజ్తో మారుతి సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం మొదలైంది. వీరి కలయికలో కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని మారుతి సన్నిహిత వర్గాలు ఖండించాయి.
మారుతి కొత్త సినిమా గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. తన తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు సన్నిహితులు. బహుశా మారుతి ఇంకా తన కొత్త సినిమాకు కథ రెడీ చేసి ఉండకపోవచ్చు. స్క్రిప్టు రెడీ అయ్యాకే దానికి తగ్గ హీరోను ఎంచుకోవాలని భావిస్తుండొచ్చు.
రాజాసాబ్ లాంటి భారీ చిత్రం తర్వాత మళ్లీ పెద్ద సినిమానే తీయాలనేమీ తాను ఫిక్స్ కాలేదని.. ఆ సమయంలో ఏ కథ కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని.. చిన్న సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమే అని మారుతి ఇంతకుముందు స్పష్టం చేశాడు. ఇప్పుడతను బలమైన స్క్రిప్టుతో రంగంలోకి దిగాల్సిందే.
మారుతి బలం కామెడీ. కానీ రాజాసాబ్లో ఆ బలాన్ని అతను చూపించలేకపోయాడు. ఫస్టాఫ్లో కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సినిమా దెబ్బ తింది. కాబట్టి ఈసారి తన ఫన్ పవర్ చూపించి మంచి ఎంటర్టైనర్తో ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి. అతడి కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…