టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే వాళ్ళను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ఇప్పుడీ టాప్ 5 లిస్టులో ఖచ్చితంగా గుర్తుకు వచ్చే పేరు నరేష్.
ఒకప్పుడు హీరోగా కామెడీ చిత్రాలతో స్టార్ డం సంపాదించుకున్న నరేష్ తొంబై దశకంలో చిత్రం భళారే విచిత్రం, బావా బావా పన్నీరు, జంబలకిడిపంబ, పోలీస్ భార్య, హైహై నాయక లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో తనదైన ముద్ర వేశారు. తర్వాత క్రమంగా సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయి మోస్ట్ బిజీగా ఆర్టిస్టుగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇటీవలే విడుదలైన నారి నారి నడుమ మురారిలో శర్వానంద్, ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ నరేష్ టైమింగ్ థియేటర్లలో విపరీతమైన నవ్వులు పూయించింది. తాత వయసులో పెళ్లి చేసుకున్న యువకుడిగా ఆయన మీద రాసుకున్న జోకులు ఓ రేంజ్ లో పేలాయి.
అంతకు ముందు సామజవరగమన, కె ర్యాంప్ లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో వాటికి బలమయ్యారు. పర్సనల్ లైఫ్ నే ‘మళ్ళీ పెళ్లి’ పేరుతో సినిమాగా తీయడం నరేష్ కే చెల్లింది. ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సరంతో సోలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాగుబోతు పాత్రలో గెటప్, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి.
నరేష్ సమకాలీకులు రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి వాళ్ళు కూడా బిజీగా ఉన్నప్పటికీ నరేష్ తరహా దూకుడు వాళ్లలో అంతగా కనిపించదు. కేవలం హాస్య పాత్రలే కాదు ఎమోషనల్ గానూ తన సత్తా ఏమిటనేది రంగస్థలం, అందరి బంధువయా లాంటి సినిమాల్లో నరేష్ ఆల్రెడీ చూపించారు.
ఖరీదైన లైఫ్ స్టైల్ మైంటైన్ చేసే నరేశ్ విజయకృష్ణ 65 వయసులోనూ ఇంత చలాకీగా ఉండటం విశేషమే. అందులోనూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ, తన సినిమాల ఈవెంట్లు ఏవున్నా సరే, మిస్ కాకుండా పాల్గొని వాటిని వీలైనంత మేరకు పుష్ చేయడం నరేష్ వైపు నిర్మాతలకు కలిగే మరో పెద్ద ప్రయోజనం.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…