సాయి పల్లవి ఒక సినిమా సైన్ చేయాలంటే అంత ఆషామాషీ విషయం కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ వుంటారు. అయితే ఆ పద్ధతిని ఆమె మార్చేసుకుందట. వచ్చిన ప్రతి అవకాశాన్నీ జారవిడుచుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని గ్రహించిన సాయి పల్లవి ఇప్పుడు పాత్రల ఎంపికలో పట్టు విడుపులు చూపిస్తోందట. అయితే తనకున్న డిమాండ్ ఎలాంటిది, ఇండస్ట్రీలో తాను మాత్రమే చేయగల పాత్రలు ఎన్ని వున్నాయనేది ఆమె కనిపెట్టేసిందట. అందుకే నిర్మాతలు తనను అప్రోచ్ అయితే చేయనని చెప్పకుండా భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందట.
సినిమాలో తన పాత్ర నిడివి ఎంత, ఎన్ని రోజులు పని చేయాలనేది కాకుండా తనకింత కావాలంటూ నిర్మొహమాటంగా చెబుతోందట. అంత పారితోషికం ఇవ్వగలిగిన వాళ్లకే ఆమె డేట్స్ ఇస్తోందట. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు నటించే వాటిలో ఎక్కువగా గ్లామర్ ప్రధాన హీరోయిన్ పాత్రలే వుంటాయి. అలాంటివాటికి సాయి పల్లవిని ఎలాగో అప్రోచ్ అవలేరు. కానీ నటిగా తాను మాత్రమే చేయగల పాత్రలయితే వుంటూనే వుంటాయి. అందుకే ఆ స్పేస్లో ఎక్కువ మంది లేని లోటుని ఆమె ఫుల్గా క్యాష్ చేసుకుంటోందని టాలీవుడ్లో వినిపిస్తోన్న టాక్.
This post was last modified on December 14, 2020 9:08 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…