తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా ఇండస్ట్రీకి హైదరాబాదే కేంద్రం. ఐతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ను కూడా షూటింగ్ల కోసం ఉపయోగించుకోవాలని, అవసరమైన ప్రోత్సాహాలన్నీ అందిస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.
కానీ ఒకప్పట్లా రియల్ లొకేషన్లలో సినిమాలు తీయడం తగ్గిపోవడంతో ఏపీలో అనుకున్నంత మేర చిత్రీకరణలు జరగట్లేదు. ఐతే ఇటీవల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీలో షూటింగ్స్ పెంచే ప్రయత్నం జరుగుతోంది. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం షూటింగ్ చాలా వరకు ఏపీలోని గోదావరి ప్రాంతంలోనే జరిగింది.
ఇందుకు పవన్ కళ్యాణ్ మాటలే స్ఫూర్తి అని అంటున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఏపీలో ఎక్కువగా షూటింగ్స్ జరగాలంటూ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో చెప్పిన మాటలు తన మనసుకు హత్తుకున్నాయని నవీన్ చెప్పాడు. అందుకే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ భాగం షూటింగ్ చేశామని అతనన్నాడు.
తమ సినిమాకు ఎక్కడ షూటింగ్ జరిగినా అధికారులు సులువుగా అనుమతులు ఇచ్చేశారని.. ఎంతో సహకరరించారని.. స్థానికులు కూడా బాగా సహకరించారని నవీన్ తెలిపాడు. నవీన్లాగే టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు పవన్ మాటలను ఆలకించి.. అనుసరించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రతి సినిమాకూ అక్కడికి వెళ్లాలని కాదు కానీ.. కథ ప్రకారం ఏపీలో చిత్రీకరించాల్సి వచ్చినపుడు రియల్ లొకేషన్లను ఎంచుకోవడం వల్ల సినిమాకు ఒక అథెంటిసిటీ వస్తుంది. రియల్ లొకేషన్లలో చిత్రీకరణ కొంచెం కష్టమే అయినప్పటికీ.. సరైన ప్లానింగ్, జాగ్రత్తలతో షూటింగ్స్ ప్లాన్ చేస్తే ఒరిజినల్ క్వాలిటీ కనిపిస్తుంది. అలాగే బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ దిశగా టాలీవుడ్ నిర్మాతలు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరముంది.
This post was last modified on January 19, 2026 12:20 pm
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…