ఒకప్పుడు 14 రీల్స్ సంస్థలో భాగస్వామిగా నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే లాంటి భారీ చిత్రాలు నిర్మించారు అనిల్ సుంకర. ఆ సంస్థలో కొనసాగుతూనే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసేవారు. కానీ తర్వాత ఆయన 14 రీల్స్ నుంచి బయటికి వచ్చారు. ఏకే బేనర్లోనే సినిమాలు తీయడం కొనసాగించారు. ఐతే అంతకుముందులా ఈ సంస్థ చిన్న సినిమాలకు పరిమితం కాలేదు. పెద్ద సినిమాలను నెత్తికెత్తుకుంది.
కానీ అవి అనిల్ సుంకరను దారుణంగా దెబ్బ కొట్టాయి. శర్వానంద్, సిద్దార్థ కలయికలో వారి మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టి తీసిన ‘మహాసముద్రం’ అనిల్కు పెద్ద షాక్. అది చాలదన్నట్లుగా ఆ తర్వాత అఖిల్తో తీసిన ‘ఏజెంట్’, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ అనిల్ కొంప ముంచాయి. ఈ మూడు చిత్రాలు కలిపితే ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఇలాంటి ఎదురు దెబ్బల తర్వాత కూడా ఓ నిర్మాత ఇండస్ట్రీలో నిలబడడం అంటే గొప్ప విషయమే.
కానీ అనిల్ సుంకర మాత్రం ధైర్యంగానే పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఐతే పెద్ద సినిమాలు అనిల్ను దారుణమైన దెబ్బ కొడుతున్నప్పటికీ.. చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలు మాత్రం ఆయనకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కొన్నేళ్ల ముందు ఆయన శ్రీ విష్ణుతో ‘సామజవరగమన’ తీశారు. అది అనిల్కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గత ఏడాది సందీప్ కిషన్తో చేసిన ‘మజాకా’ హిట్ కాకపోయినా.. తక్కువ బడ్జెట్లో తీసి, బాగా బిజినెస్ చేయడం వల్ల కొంతమేర లాభాలు వచ్చాయి.
తాజాగా అనిల్ ‘నారీ నారీ నడుమ మురారి’తో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంటున్నారు. పరిమిత బడ్జెట్లో తీసిన ఈ చిత్రం.. సైలెంటుగా సంక్రాంతి రేసులోకి వచ్చింది. పెద్దగా బజ్ లేకపోయినా మంచి టాక్ రావడం, సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో భారీ లాభాల దిశగా దూసుకెళ్తోంది శర్వా సినిమా. ఈ చిత్రం అనిల్కు భారీ లాభాలే అందించేలా ఉంది. ఈ చిత్రం పెట్టుబడి మీద రెండు మూడు రెట్ల ఆదాయం తెచ్చిపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…