ఒకప్పుడు 14 రీల్స్ సంస్థలో భాగస్వామిగా నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే లాంటి భారీ చిత్రాలు నిర్మించారు అనిల్ సుంకర. ఆ సంస్థలో కొనసాగుతూనే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసేవారు. కానీ తర్వాత ఆయన 14 రీల్స్ నుంచి బయటికి వచ్చారు. ఏకే బేనర్లోనే సినిమాలు తీయడం కొనసాగించారు. ఐతే అంతకుముందులా ఈ సంస్థ చిన్న సినిమాలకు పరిమితం కాలేదు. పెద్ద సినిమాలను నెత్తికెత్తుకుంది.
కానీ అవి అనిల్ సుంకరను దారుణంగా దెబ్బ కొట్టాయి. శర్వానంద్, సిద్దార్థ కలయికలో వారి మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టి తీసిన ‘మహాసముద్రం’ అనిల్కు పెద్ద షాక్. అది చాలదన్నట్లుగా ఆ తర్వాత అఖిల్తో తీసిన ‘ఏజెంట్’, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ అనిల్ కొంప ముంచాయి. ఈ మూడు చిత్రాలు కలిపితే ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఇలాంటి ఎదురు దెబ్బల తర్వాత కూడా ఓ నిర్మాత ఇండస్ట్రీలో నిలబడడం అంటే గొప్ప విషయమే.
కానీ అనిల్ సుంకర మాత్రం ధైర్యంగానే పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఐతే పెద్ద సినిమాలు అనిల్ను దారుణమైన దెబ్బ కొడుతున్నప్పటికీ.. చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలు మాత్రం ఆయనకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కొన్నేళ్ల ముందు ఆయన శ్రీ విష్ణుతో ‘సామజవరగమన’ తీశారు. అది అనిల్కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గత ఏడాది సందీప్ కిషన్తో చేసిన ‘మజాకా’ హిట్ కాకపోయినా.. తక్కువ బడ్జెట్లో తీసి, బాగా బిజినెస్ చేయడం వల్ల కొంతమేర లాభాలు వచ్చాయి.
తాజాగా అనిల్ ‘నారీ నారీ నడుమ మురారి’తో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంటున్నారు. పరిమిత బడ్జెట్లో తీసిన ఈ చిత్రం.. సైలెంటుగా సంక్రాంతి రేసులోకి వచ్చింది. పెద్దగా బజ్ లేకపోయినా మంచి టాక్ రావడం, సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో భారీ లాభాల దిశగా దూసుకెళ్తోంది శర్వా సినిమా. ఈ చిత్రం అనిల్కు భారీ లాభాలే అందించేలా ఉంది. ఈ చిత్రం పెట్టుబడి మీద రెండు మూడు రెట్ల ఆదాయం తెచ్చిపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 19, 2026 8:53 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…