తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత పడుతోంది. అదే సమయంలో కొత్త మల్టీప్లెక్సుల నిర్మాణం మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఏటా కొత్త మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.
నగరంలో అరడజనుకు పైగా మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉండడం విశేషం. అందులో మూడింటిని ఈ సంక్రాంతికి ఆరంభిస్తారని ప్రచారం జరిగింది. పండక్కి కొత్త మల్టీప్లెక్సుల్లో సినిమాలు ఆయా ఏరియాల ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు. కానీ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించాయి వాటి యాజమాన్యాలు.
కోకాపేటలో అల్లు కుటుంబానికి చెందిన ‘అల్లు సినిమాస్’ గురించి కొన్ని రోజుల ముందు పెద్ద డిస్కషనే నడిచింది. అల్లు అర్జున్ కూడా హాజరై ఆ మల్టీప్లెక్స్ సాఫ్ట్ లాంచ్ కూడా పూర్తి చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఈ మల్లీప్లెక్స్ అందుబాటులోకి రావడమే తరువాయి అనుకున్నారు. సంక్రాంతి సినిమాలతోనే ఇది ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
75 అడుగులతో ఆసియాలోనే అతి పెద్ద దాల్బీ స్క్రీన్ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో అందులో సంక్రాంతి సినిమాలు చూడాలని ఆడియన్స్ ఎంతో ఉత్సాహం చూపించారు. కానీ ఈ మల్టీప్లెక్స్ సంక్రాంతికి అందుబాటులోకి రాకపోవడంతో నిరాశ తప్పలేదు.
మరోవైపు హైదరాబాదీల ఫేవరెట్ సినిమా డెస్టినేషన్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రెండు మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉన్నాయి. గతంలో సుదర్శన్ 70 ఎంఎం ఉన్న చోట ఏఎంబీ సినిమాస్ను నిర్మిస్తున్నారు. దానికి ఎదురుగా ఒడియన్ థియేటర్లు ఉన్న చోట పీవీఆర్ వాళ్ల మల్టీప్లెక్స్ కడుస్తున్నారు.
ఇవి రెండూ సంక్రాంతికే అందుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి. చివరికి చూస్తే అవి కూడా సమయానికి పూర్తి కాలేదు. సంక్రాంతికి ఐదు కొత్త సినిమాలు రిలీజైన నేపథ్యంలో ఈ కొత్త మల్టీప్లెక్సులు రెడీ అయి ఉంటే సందడే వేరుగా ఉండేది. మళ్లీ వేసవి ఆరంభంలో కానీ బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి హంగామా ఉండదు. ఈలోపు వీటిని ఆరంభిస్తే సంక్రాంతి టైంలో ఉండే సందడిని చూడలేం.
This post was last modified on January 17, 2026 12:49 pm
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…