Movie News

జాక్ పాట్ కొడుతున్న ‘డ్రాగన్’ హీరో

భాషతో సంబంధం లేకుండా యూత్ లో మంచి వైబ్ ఉన్న పేరు ప్రదీప్ రంగనాథన్. 2026లో డ్రాగన్, డ్యూడ్ రూపంలో రెండు పెద్ద హిట్లు అందుకున్న ఈ కుర్రాడు ఇప్పట్లో ఆగేలా లేడు. ఫ్యాన్స్ ముద్దుగా జూనియర్ ధనుష్ అని పిలుచుకుంటారు.

ఇతని కొత్త మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ కోసం మల్లగుల్లాలు పడుతోంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఫాంటసీ మూవీలో ఎస్జె సూర్య ముఖ్య పాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇన్ని అట్రాక్షన్లు ఉన్నా ఏవో అంతర్గత కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ డైరెక్టర్ కాబోతున్నట్టు చెన్నై టాక్. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఒక డిఫరెంట్ సోషియో ఫాంటసీ సబ్జెక్టు రాసుకున్నాడట. జయం రవి హీరోగా తీసిన ఇతని డెబ్యూ మూవీ కోమలి ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. తర్వాత లవ్ టుడేతో హీరోగా మారి తనను తాను డైరెక్ట్ చేసుకున్నాడు. ఇది ఇంకా పెద్ద హిట్టు.

తర్వాత మళ్ళీ మెగా ఫోన్ చేపట్టలేదు.ఇప్పుడు ఏజిఎస్ నిర్మించబోయే ఈ మూవీ దాదాపు లాకైనట్టేనని అంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలోపు దీనికి సంబంధించిన అనౌన్స్ చేయొచ్చు.

ఇక శ్రీలీల విషయానికి వస్తే కథ నచ్చితే హిందీ, తమిళం అని చూడటం లేదు. ఒప్పేసుకుంటోంది. ప్రదీప్ రంగనాథన్ ఎలాగూ ట్రెండ్ లో ఉన్నాడు కాబట్టి తనతో చేస్తే మంచి బ్రేకే దక్కొచ్చు. ఏడాదిగా అనగనగా ఒక రాజుకి అంకితమైపోయిన మీనాక్షి చౌదరికి కూడా ఇది మంచి మలుపు అవుతుంది.

నువ్వు హీరో మెటీరియల్ కాదుగా అనే ప్రశ్నను మీడియాలో ఎదురుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డిమాండ్ ఉన్న గ్లామర్ హీరోయిన్లను తన సరసన నటించేలా చేయడంలో సక్సెసవుతున్నాడు. తెలుగులో ఒక స్ట్రెయిట్ మూవీ చేయాలని కోరిక ఉన్న ప్రదీప్ రంగనాథన్ త్వరలోనే దాన్ని తీర్చుకునే అవకాశాలు లేకపోలేదు.

This post was last modified on January 17, 2026 11:23 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

6 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago