సూపర్ స్టార్ రజినీకాంత్ వయసిప్పుడు 70 ఏళ్లు. ఆయనకు ఎప్పట్నుంచో అనారోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రెండుమూడుసార్లు ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఒక దశలో ఆయనకు ప్రాణాలకే ముప్పు కూడా తలెత్తింది. ఆ పరిస్థితుల్లోనే కొన్ని నెలల పాటు సింగపూర్లో ఉండి చికిత్స తీసుకుని ప్రాణాపాయం తప్పించుకున్నారు. రెండేళ్లుగా బాగానే కనిపిస్తున్నప్పటికీ ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నది మాత్రం స్పష్టం. అందుకే కరోనా టైంలో రజినీ అత్యంత జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు.
ఆయన ఆరు నెలలకు పైగా ఇంటి నుంచి కాలు అడుగు బయటికి పెట్టలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు ప్రముఖులకు ఏమైందో చూశాక రజినీ అలా భయపడటంలో తప్పేమీ లేదనే అనిపించింది జనాలకు. ఒక దశలో కరోనా భయంతో రాజకీయాల్లోకి రావడంపైనే పునరాలోచనలో పడ్డారు రజినీ.
ఐతే ఈ మధ్య ఆలోచన మార్చుకుని రాజకీయారంగేట్రానికి ముహూర్తం పెట్టేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ‘అన్నాత్తె’ సినిమాను కూడా పూర్తి చేయడానికి ఆయన పూనుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా హైదరాబాద్లో పున:ప్రారంభం కావడం విశేషం. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని తన టీంతో కలిసి ఆయన హైదరాబాద్కు వచ్చారు. అత్యంత జాగ్రత్తల మధ్య, ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా రజినీ షూటింగ్లో పాల్గొంటున్నారట. ఐతే వేరే సహాయకుల్ని నమ్ముకుని తండ్రిని వదిలిపెట్టలేక రజినీతో పాటు ఆయన పెద్ద కూతురు, ధనుష్ భార్య ఐశ్వర్య ఉండటం విశేషం.
తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఐశ్వర్య తన పనులన్నీ మానుకుని వెంట వచ్చేసింది. సినిమా సెట్లో రజినీతో పాటు ఐశ్వర్య ఉన్న ఫొటో కూడా ట్విట్టర్లో కనిపిస్తోంది. ఇది చూసి తండ్రి మీద కూతురికి ఉన్న శ్రద్ధ ఏంటన్నది స్పష్టమవుతోందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on December 14, 2020 2:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…