Movie News

రజినీని కాపాడుకోవడానికి కూతురొచ్చింది

సూపర్ స్టార్ రజినీకాంత్ వయసిప్పుడు 70 ఏళ్లు. ఆయనకు ఎప్పట్నుంచో అనారోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రెండుమూడుసార్లు ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఒక దశలో ఆయనకు ప్రాణాలకే ముప్పు కూడా తలెత్తింది. ఆ పరిస్థితుల్లోనే కొన్ని నెలల పాటు సింగపూర్‌లో ఉండి చికిత్స తీసుకుని ప్రాణాపాయం తప్పించుకున్నారు. రెండేళ్లుగా బాగానే కనిపిస్తున్నప్పటికీ ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నది మాత్రం స్పష్టం. అందుకే కరోనా టైంలో రజినీ అత్యంత జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు.

ఆయన ఆరు నెలలకు పైగా ఇంటి నుంచి కాలు అడుగు బయటికి పెట్టలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు ప్రముఖులకు ఏమైందో చూశాక రజినీ అలా భయపడటంలో తప్పేమీ లేదనే అనిపించింది జనాలకు. ఒక దశలో కరోనా భయంతో రాజకీయాల్లోకి రావడంపైనే పునరాలోచనలో పడ్డారు రజినీ.

ఐతే ఈ మధ్య ఆలోచన మార్చుకుని రాజకీయారంగేట్రానికి ముహూర్తం పెట్టేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ‘అన్నాత్తె’ సినిమాను కూడా పూర్తి చేయడానికి ఆయన పూనుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా హైదరాబాద్‌లో పున:ప్రారంభం కావడం విశేషం. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని తన టీంతో కలిసి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అత్యంత జాగ్రత్తల మధ్య, ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా రజినీ షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఐతే వేరే సహాయకుల్ని నమ్ముకుని తండ్రిని వదిలిపెట్టలేక రజినీతో పాటు ఆయన పెద్ద కూతురు, ధనుష్ భార్య ఐశ్వర్య ఉండటం విశేషం.

తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఐశ్వర్య తన పనులన్నీ మానుకుని వెంట వచ్చేసింది. సినిమా సెట్లో రజినీతో పాటు ఐశ్వర్య ఉన్న ఫొటో కూడా ట్విట్టర్లో కనిపిస్తోంది. ఇది చూసి తండ్రి మీద కూతురికి ఉన్న శ్రద్ధ ఏంటన్నది స్పష్టమవుతోందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Satya

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

30 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago