మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి తరహా ఫాంటసీ కథతో అతనీ సినిమా చేయడానికి సిద్ధమవడం.. అనౌన్స్మెంట్ పోస్టరే క్రేజీగా ఉండడం.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా మొదలు కావడం.. ఇలా ప్రతి విషయంలోనూ ఎగ్జైటింగ్గా కనిపించింది ఈ సినిమా.
కానీ ‘విశ్వంభర’ టీజర్ లాంచ్ కాగానే.. ఆ సినిమా చుట్టూ ఉన్న హైప్ అంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. టీజర్ మీద విపరీతంగా ట్రోల్స్ రావడంతో టీం కంగారు పడిపోయింది. సినిమాను ముందు అనుకున్న డేట్కి రిలీజ్ చేయకుండా వెనక్కి తగ్గింది. వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది సంక్రాంతికి అనుకున్న సినిమా కాస్తా.. ఈ సంక్రాంతికి కూడా రాలేదు. వేసవికి వాయిదా వేశారు.
కానీ వేసవికి అయినా సినిమా వస్తుందా అన్న అనుమానాలతో అభిమానులు ఉన్నారు. ఇలాంటి లాంగ్ డిలేయ్డ్ మూవీస్కి తగ్గిన హైప్ను మళ్లీ పెంచడం అంత తేలిక కాదు. ఐతే దీని తర్వాత మొదలై.. దీని కంటే ముందు రిలీజైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించే దిశగా దూసుకెళ్తుండడం ‘విశ్వంభర’ టీంకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే.
ఒక దశలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మీద కూడా అనుమానాలు కలిగాయి. ఈ సినిమా ఆడుతుందో లేదో అనిపించింది. ఒకవేళ దీని ఫలితం తేడా కొడితే.. ‘విశ్వంభర’ పరిస్థితి అగమ్య గోచరంగా మారేది. ఆల్రెడీ ‘భోళా శంకర్’తో దెబ్బ తిన్న చిరు మార్కెట్ మరింత డౌన్ అయ్యేది. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ‘విశ్వంభర’కు బిజినెస్ చేయడం సవాలుగా మారేది. దాని రిలీజ్ ప్రమాదంలో పడేది.
కానీ ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని చిరు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. చిరు బాక్సాఫీస్ పవర్ ఏంటో బయ్యర్లకు అర్థమవుతోంది కాబట్టి ఆయన తర్వాతి సినిమాను కొనడానికి ముందుకు వస్తారు. కాబట్టి ‘విశ్వంభర’ను బయట పడేయడానికి మార్గం దొరికినట్లే. కొంచెం జాగ్రత్తగా పని చేసి బెటర్ ఔట్ పుట్ తీసుకొస్తే చిరు ఖాతాలో మరో పెద్ద హిట్ పడే అవకాశం కూడా ఉంటుంది.
This post was last modified on January 14, 2026 10:23 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…