ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన శైలిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సినిమా తీసే దర్శకుల కోసం చూస్తుంటారు. ఆ హీరో కెరీర్లో ది బెస్ట్ అనిపించుకున్న సినిమాలను.. పెర్ఫామెన్సులను గుర్తు చేసేలా పాత్రలను క్రియేట్ చేసి.. తెరపై బాగా ప్రెజెంట్ చేస్తే ఫ్యాన్స్కు నోస్టాల్జిక్ ఫీల్ వస్తుంది. వారి ఆనందానికి అవధులు ఉండవు.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక చాలా సినిమాల్లో ఆయన బలాలను సరిగా వాడుకోలేకపోయారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. వింటేజ్ చిరును తెరపైకి తీసుకొచ్చి, అభిమానులను అమితానందానికి గురి చేసిన దర్శకుడంటే బాబీనే. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు కామెడీ టైమింగ్ను అతను వాడుకున్న తీరు అభిమానులకు నచ్చింది. ఆ సినిమాలో అందరికీ వింటేజ్ చిరు ఛాయలు కనిపించాయి. ఐతే ‘వాల్తేరు వీరయ్య’లో బాబీ చూపించింది టీజర్ మాత్రమే. ఇప్పుడు అనిల్ ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఏకంగా ట్రైలరే వదిలాడు.
వింటేజ్ చిరును రీఎంట్రీలో అనిల్ కంటే బాగా ఇంకెవరూ వాడుకోలేదన్నది స్పష్టం. ఇకముందు కూడా చిరును ఇంత బాగా ఇంకొకరు ప్రెజెంట్ చేయగలరా అన్నది సందేహమే. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్.. ఇలా ఎన్నో చిరు బ్లాక్ బస్టర్ సినిమాల్లోంచి ఆయన కామెడీ టైమింగ్ను సరిగ్గా పట్టుకుని దాన్ని మళ్లీ అందంగా రీక్రియేట్ చేయడంలో అనిల్ విజయవంతం అయ్యాడు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ చూసి చిరు కామెడీ వర్కవుట్ అవుతుందా.. కెరీర్లో ఈ దశలో ఆయనకు టైమింగ్ కుదురుతుందా.. ఈ తరం ప్రేక్షకులను ఆయన మెప్పించగలరా అన్న సందేహాలు కలిగాయి కానీ.. సినిమా చూశాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సినిమా అంతా మంచి ఫ్లోతో వెళ్లిపోయాడు చిరు.
తనదైన కామెడీ టైమింగ్తో నిన్నటితరం అభిమానులనే కాక.. ఈ తరం ప్రేక్షకులనూ ఆయన ఆకట్టుకుంటున్నారు. చిరు పాత సినిమాల మీద ఎంతో రీసెర్చ్ చేసి.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిని కూడా దృష్టిలో ఉంచుకుని అనిల్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులైతే అనిల్ను మామూలుగా పొగడట్లేదు. థాంక్యూ అనిల్ రావిపూడి అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on January 13, 2026 2:24 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…