తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై టికెట్ల రేట్లు పెంచబోమని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఐతే ఇటీవల సంక్రాంతి సినిమాలకు మళ్లీ రేట్లు పెంచుతూ జీవోలు విడుదల చేశారు.
దీని గురించి ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ జీవోల గురించి తనకు తెలియదని.. రేట్ల పెంపుతో తన ప్రమేయం ఏమీ లేదని తేల్చేశారు కోమటిరెడ్డి. ఐతే దీని మీద బీఆరెస్ అగ్ర నేత హరీష్ రావు.. ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
సినిమాటో గ్రఫి మంత్రికి తెలియకుండా జీవోలు ఎవరు జారీ చేస్తున్నారు, ఇదేం ప్రభుత్వం అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి కోమటి రెడ్డి స్పందించారు. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి జీవోలతో తనకు సంబంధం లేదన్న గత వ్యాఖ్యలపై యుటర్న్ తీసుకున్నారు.
ఇటీవల రెండు, మూడు సినిమాల జీవోల సమయంలో తాను నల్గొండలో ఉన్నట్లు చెప్పారు. కాబట్టే ఆ జీవోల గురించి తనకు తెలియదని చెప్పానన్నారు. ఐతే రేవంత్ రెడ్డి, తాము కూర్చుని రేట్ల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో సినిమా కార్మికులకు 20 శాతం ఇచ్చే విధంగా జీవోలను జారీ చేశామన్నారు.
సీఎం రేవంత్ ఏ శాఖలో తలదూర్చరని ఆయన స్పష్టం చేశారు. ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ..మంత్రులకు ఫ్రీ హ్యండ్ ఇస్తారన్నారు. హరీష్ రావును, బీఆరెస్ పార్టీని చూస్తే తనకు జాలేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక్క ఎంపీ సీటును గెలుచుకొలేకపోయారని, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బొక్కాబొర్లా పడ్డారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలుచేయడం బీఆర్ఎస్ కు అలవాటే అన్నారు. వారికి ఏ పనిపాటలేదని, తమకు చాలా పని ఉందని.. ఇంతకుముందు తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
This post was last modified on January 12, 2026 9:15 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…