ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తికి పది రోజుల పాటు హైక్స్ పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది.
మల్టీప్లెక్సుల్లో ప్రతి టికెట్ మీద 75, సింగల్ స్క్రీన్ లో 50 రూపాయల మేరకు పెంచుకునేందుకు పర్మిషన్ వచ్చింది. జిఓ ప్రకారం పండగ అయిపోయాక కూడా ఈ వెసులుబాటుని వాడుకునేలా కాల వ్యవధి ఉంది. ఇలా చేయడం కొత్త కాదు. గత ఏడాది హిట్ 3, తండేల్, మ్యాడ్ స్క్వేర్ లాంటివి పెంపు తీసుకున్న విషయం తెలిసిందే.
దీనికి ప్రేక్షకులు ఎలా రెస్పాన్స్ అవుతారనేది ఫలితాలను బట్టి ఉంటుంది. కంటెంట్ బాగుంటే యాభై వందా ధర ఎక్కువైనా ఆడియన్స్ భరించే స్థితిలోనే ఉన్నారని గతంలో ఋజువయ్యింది. ఒకవేళ ఫ్లాప్ అయితే ఇది పెద్ద శాపంగా మారుతుంది.
రవితేజ, నవీన్ పోలిశెట్టి నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా మెప్పిస్తామనే నమ్మకంతో పెంపు అవకాశాన్ని వాడుకుంటున్నారు. వీళ్ళు కోరుకుంటున్నట్టు నిజంగా బాగుందనే మాట పబ్లిక్ నుంచి వస్తే అదే భలే వరంగా మారుతుంది. థియేటర్ బిజినెస్ కోణంలో తొందరగా బ్రేక్ ఈవెన్ చేరుకోవడంతో పాటు లాభాలలో పెద్ద నెంబర్లు కనిపిస్తాయి.
నాణేనికి రెండో వైపు అన్నట్టు వందల కోట్లతో తీసిన వాటికి, రీజనబుల్ బడ్జెట్ తో అయినవాటికి పెంపు ఇవ్వడం పట్ల సాధారణ ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇదేంటని ఎవరైనా వేరే నిర్మాతలను ప్రశ్నిస్తే బస్సు చార్జీలు, ఉల్లిపాయల ధరలు, ఫ్లైట్ టికెట్లు పెరిగినప్పుడు రాని చర్చ, డిమాండ్ కేవలం మా ఇండస్ట్రీకి మాత్రమే వస్తుందని కొత్త లాజిక్ తీస్తున్నారు.
ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కనపెడితే ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. అది బాగుంటే ఎలాంటి డిబేట్లు ఉండవు. లేదంటేనే అసలు చిక్కు. ఎవరికి వారు ధీమాగా అయితే ఉన్నారు మరి.
This post was last modified on January 10, 2026 6:02 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…