కెజిఎఫ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న శాండల్ వుడ్ స్టార్ యష్ మార్చి 19న టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటిదాకా హీరోయిన్ల పోస్టర్లు వచ్చాయి కానీ హీరో వైపు నుంచి సాలిడ్ కంటెంట్ రాలేదనే లోటు అభిమానుల్లో ఉంది.
దాని తీర్చేందుకే యష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదిలారు. కేవలం ఒక ఎపిసోడ్ ని తీసుకుని దాన్నుంచే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు. క్రిటికల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది.
కథేంటో చెప్పలేదు కానీ హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుక్కి దహన సంస్కారాలు జరుగుతుండగా రాయ (యష్) అక్కడికి కారులో వస్తాడు. దాన్నుంచి వైర్ల ద్వారా స్మశానం లోపల డైనమేట్లు పెట్టించి కారు నుంచి బయటికి రాకుండా బాంబులు పేల్చేస్తాడు.
అదెలా చేశాడనేది ఇక్కడ రాయడం సభ్యతగా ఉండదు కానీ అది విజువల్ గా చూస్తేనే బెటర్. మాములుగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కనిపించే అడల్ట్ టైప్ కంటెంట్ ఇక్కడ జొప్పించడం ఆశ్చర్యం కన్నా ఎక్కువ షాక్ కలిగిస్తుంది. యష్ ఆశించినట్టే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్టే ఉన్నాడు.
పీరియాడిక్ సెటప్ లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్చి 19 విడుదలకే కట్టుబడింది. అదే రోజు దురంధర్ 2 ఉన్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. అడవి శేష్ డెకాయిట్ కూడా సేమ్ డేట్ లాక్ చేసుకుంది. ఇవి వచ్చిన వారం రోజులకే పెద్ది దండయాత్ర ఉంటుంది.
రవి బస్రూర్ సంగీతం ఎప్పటిలాగే ఇంటెన్సిటీతో సాగగా మేకింగ్ క్వాలిటీ మాత్రం టాప్ స్టాండర్డ్ లో ఉంది. యష్ తప్ప వేరే ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. కాకపోతే మరీ ఇంత పచ్చిగా హీరో పాత్రని డిజైన్ చేయడం అది కూడా మహిళా దర్శకురాలంటే నమ్మశక్యంగా లేదు. కథ యష్ దే కాబట్టి తన ఐడియానే ఉండొచ్చు.
This post was last modified on January 8, 2026 10:39 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…