సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్ కంటెంట్ బయటికి వస్తోంది. ఇప్పటిదాకా ఎమోషనల్ మూవీస్ ఎక్కువగా తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈసారి రూటు మార్చి కామెడీ జానర్ కు వచ్చేశారు.
తన శైలికి భిన్నంగా కొత్తగా ట్రై చేస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట రిలీజ్ చేసిన సాంగ్స్ ఏమో కానీ ఇటీవలే విడుదల చేసిన వామ్మో వాయ్యో పాట బాగా రీచ్ అవుతోంది. ఈ క్రమంలో ట్రైలర్ తో కథ గురించి మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
స్టోరీగా చెప్పుకుంటే ఇదేం కొత్తది కాదు. భార్య (డింపుల్ హయతి)ని ప్రాణంగా ప్రేమించే రామ్ (రవితేజ) జీవితంలో అనుకోకుండా మరో అమ్మాయి (ఆశికా రంగనాథ్) వస్తుంది. అక్కడి నుంచి డబుల్ డ్రామా మొదలవుతుంది. స్నేహితులు, బంధువులు ఎంత వారించినా ఇద్దరి మధ్య నలిగిపోయే పరిస్థితి తలెత్తుతుంది.
ఇంతకీ అందమైన వైఫ్ ఉండగా రామ్ ఇలా పక్కదారి ఎందుకు పట్టాడనేది తెరమీద చూడాలి. ట్రైలర్ ప్రారంభంలోనే జాతర ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ ఫార్ములాలు చేసి విసుగొచ్చిందని, అందుకే డాక్టర్ సలహా మేరకు కొత్త రూటు పట్టానని రవితేజతో చెప్పించడం వెరైటీగా ఉంది.
కిషోర్ తిరుమల టీమ్ తెలివిగా సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ ని వాడుకుంది. కమెడియన్ సత్య పాత్రతో వేయించిన జోకులు, జనరేటర్ లో చక్కర పోయడం ద్వారా సృష్టించిన కామెడీ అవి ఎవరిని ఉద్దేశించినవో స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు కానీ కంటెంట్ కు తగ్గట్టు బీట్స్ ఇచ్చాడు. మాస్ గోల లేకుండా రవితేజని ఇలా నవ్వించే యాంగిల్ లో చూడటం బాగుంది. హైప్ కి ట్రైలర్ ఉపయోగపడుతోంది. ఇంతే మోతాదులో హాస్యం రెండున్నర గంటల సినిమాలో ఉంటే మాత్రం జనవరి 13 భర్త మహాశయుడి లక్ష్యంగా నెరవేరినట్టే.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…