గత దశాబ్ద కాలంలో బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్లలో ‘స్పోర్ట్స్ బయోపిక్’ ఒకటి. స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ మొదలుకుని.. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చిన ‘ఎంస్.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ వరకు ఈ జానర్లో వచ్చిన సినిమాలు అద్భుత ఫలితాన్నందుకున్నాయి.
ఇప్పుడు కూడా సైనా, సింధు, గోపీచంద్, సానియా లాంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ జీవితాల ఆధారంగా సినిమాలు తీయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ కోవలో మరో మేటి క్రీడాకారుడి జీవిత కథకు వెండితెర రూపం కల్పించడానికి బాలీవుడ్ విలక్షణ దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్ రంగం సిద్ధం చేశాడు. తను వెడ్స్ మను, రాన్జానా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు తెరకెక్కించబోయేది చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కావడం విశేషం.
పాపులారిటీని పక్కన పెట్టి కేవలం క్రీడల్లో ఘనతలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలో ఆనంద్ను మించిన క్రీడాకారుడు మరొకరు ఉండరు. మనకున్న క్రికెట్ పిచ్చి వల్ల సచిన్, ధోని, కోహ్లి లాంటి క్రికెట్ సూపర్ స్టార్లను పిచ్చిగా ఆరాధిస్తాం కానీ.. ఆనంద్ ఘనతల ముందు వాళ్లు సాధించింది తక్కువే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన ఘనుడు ఆనంద్.
చెస్లో ఇండియాకు ఏమంత పేరు లేని సమయంలో, మన వాళ్లు ప్రపంచ స్థాయిలో పోటీ పడటమే గొప్ప అనుకున్న తరుణంలో కాస్పరోవ్, క్రామ్నిక్ లాంటి రష్యా దిగ్గజాలను వెనక్కి నెట్టి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఏకంగా ఐదు టైటిళ్లు సాధించి ఔరా అనిపించాడు. ఇక ఆనంద్ పనైపోయింది అనుకున్నాక కూడా గత ఏడాది ర్యాపిడ్ చెస్లో ప్రపంచ ఛాంపియన్ అయి తన సత్తాను చాటుకున్నాడు ఆనంద్. ఈ చెన్నై మేధావి జీవితంలో మలుపులకు, డ్రామాకు లోటు లేదు కాబట్టి సరిగ్గా తీస్తే ఈ బయోపిక్ బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది.
This post was last modified on December 13, 2020 2:06 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…