Movie News

నిన్న పోస్టర్ రిలీజ్.. ఈ రోజు వెనక్కి

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో ప్రేక్షకులను మెప్పించి, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొత్త దర్శకుడు స్వరూప్. ఆ సినిమా రిలీజయ్యాక ఏడాదికి పైగా విరామం తీసుకున్న స్వరూప్.. శనివారమే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే.. మిషన్ ఇంపాజిబుల్.

తొలి సినిమా సూపర్ హిట్టయిన నేపథ్యంలో ఈసారి పేరున్న హీరోతో సినిమా తీస్తాడనుకుంటే.. ముగ్గురు పిల్లల్ని ప్రధాన పాత్రలకు తీసుకుని వెరైటీ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇది టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతుండగా.. అనుకోని వివాదం చిత్ర బృందానికి ఇబ్బందికరంగా మారింది. పోస్టర్లో ఆంజనేయుడు, శివుడు, కృష్ణుడి అవతారాల్లో తుపాకులు పట్టుకుని ఉండటం కొందరికి నచ్చలేదు. దేవుళ్ల చేతికి తుపాకులివ్వడమేంటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది.

తమ పోస్టర్ ఎవరినీ కించపరిచే, మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశంతో రూపొందించింది కాదని.. ఈ పోస్టర్‌ను వెనక్కి తీసుకుంటున్నామని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ పోస్టర్ గురించి సోషల్ మీడియాలో మరీ పెద్ద రగడేమీ జరిగిపోలేదు కానీ.. అభ్యంతరం చెప్పింది ఎంత మంది అన్నది పక్కన పెడితే వివాదానికి ఎందుకు ఆస్కారం ఇవ్వడం అని భావించి పోస్టర్‌ను వెనక్కి తీసుకున్నట్లున్నారు. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఈ పోస్టర్ అయితే జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది.

అంత చిన్న పిల్లలు ఎంచుకున్న మిషన్ ఏంటి.. వాళ్లు ఏం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఓవైపు ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఇలా చిన్న పిల్లలతో సినిమా మొదలు పెట్టడం, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తర్వాత స్వరూప్ ఇలాంటి సినిమా తీయడం ఆసక్తి రేకెత్తించేదే. మరి ఈ సినిమాలో ఏం విశేషం ఉంటుందో చూడాలి.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

10 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

13 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

14 hours ago