ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్మాతలు అత్యవసరంగా కోర్టుని ఆశ్రయించారు. అయితే హియరింగ్ రేపటికి వాయిదా పడటంతో అభిమానులు నరాలు తెగే టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.
ఇదే సమయంలో విజయ్ కి సిబిఐ నోటీసులు రావడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఇప్పుడు జన నాయకుడు ముందున్న ఆప్షన్లు మరింత ఆందోళన రేపుతున్నాయి. సెన్సార్ చెప్పిన కట్స్ మ్యూట్స్ అన్నీ ఫాలో కావడం వాటిలో ముఖ్యమైంది. కానీ దానికి టీమ్ సిద్ధంగా లేదు.
రెండోది కోర్టు జడ్జ్ మెంట్ కనక కొంచెం అటుఇటు అయితే విడుదలని వాయిదా వేసుకోవడం. దీని వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోయాయి. చాలా చోట్ల ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మేశారు. పరాశక్తితో స్క్రీన్ షేరింగ్ వల్ల డిస్ట్రిబ్యూటర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జన నాయకుడు వాయిదా వేసే ఛాన్స్ లేదు.
నిర్మాత ధీమాగా క్లియరెన్స్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారట. తమిళనాడు ఎగ్జిబిటర్లు నిమిషమొక యుగంగా గడుపుతున్నారు. ఏపీ తెలంగాణలో ఇబ్బంది లేదు. ఆల్రెడీ మన స్ట్రెయిట్ సినిమాల పోటీనే తీవ్రంగా ఉంది కాబట్టి ఒత్తిడి ఉండదు.
ఈ పరిణామాలన్నీ విజయ్ రాజకీయ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తోందనే కామెంట్స్ అభిమానుల నుంచి వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైం లేదు. ముందు పరిష్కారం చూడాలి. జనవరి 9 ఎలాంటి ఆలస్యం లేకుండా షోలు పడేలా చూసుకోవాలి.
ఓవర్సీస్ కాపీలు డెలివరీ అయ్యాయి కానీ కీ డిస్పాచ్ కావాలంటే ల్యాబ్, కోర్టు నుంచి క్లియరెన్స్ రావాలి. యుఎస్ లో కూడా టికెట్లు అమ్మేసి పెట్టారు. ఇన్ని అవాంతరాలు ఆందోళన మధ్య శుక్రవారం ఉదయం అనుకున్న టైంకి షోలు పడాలని ఫ్యాన్స్ కోటి దేవుళ్ళకు దండం పెట్టేస్తున్నారు. వాళ్ళ మొర ఆలకిస్తారో లేదో చూడాలి.
This post was last modified on January 6, 2026 5:18 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…