నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో తక్కువ బడ్జెట్లో తీసిన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత కూడా మూడు మిడ్ రేంజ్ మూవీసే తీసిన అనిల్.. అయిదో సినిమాకు ఏకంగా మహేష్ బాబుతో జట్టు కట్టాడు. వీరి కలయికలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ అయింది.
తర్వాత భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సీనియర్ హీరో మూవీస్ చేసిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రాబోతున్నారు. ఎప్పటికప్పుడు కుదిరిన సినిమా చేసుకుపోవడమే తప్ప.. ఈ తరం పెద్ద స్టార్తో చేయాలని వెయిట్ చేయడం అనిల్ కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. అలా అని టాప్ స్టార్లతో సినిమాలు చేయాలని తనకు ఆశ లేదని కాదని.. ఆ ప్రయత్నాలు చేశానని చెప్పాడు అనిల్.
‘‘జూనియర్ ఎన్టీఆర్ గారికి గతంలో రెండు మూడు కథలు చెప్పా. బన్నీ గారిని కూడా కలిసి ఒక స్టోరీ మీద డిస్కస్ చేశాను. కానీ ఆ కథలేవీ వర్కవుట్ కాలేదు. ఇందులో నా ఫెయిల్యూరే ఉందని అనుకుంటా. వాళ్లను ఎగ్జైట్ చేసేలా కథలు తయారు చేసి ఉండకపోవచ్చు. లేదా అప్పటికి వాళ్లకు నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు.
నేను ఫలానా స్టార్తోనే సినిమా చేయాలి. ఇంకా పెద్ద రేంజ్ మూవీ చేయాలి అని వెయిట్ చేస్తూ కూర్చోను. ఒక సినిమా రిలీజైందా.. ఇంకో మూడు నాలుగు నెలలకే తర్వాతి సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోవాలి. అప్పటికి ఏ కథ కుదిరితే ఆ కథ.. ఏ హీరోతో సెట్ అయితే ఆ హీరోతో ముందుకు వెళ్లిపోతుంటా’’ అని అనిల్ తెలిపాడు.
సంక్రాంతి తనకు బాగా కలిసొచ్చిన సీజన్ అని.. మూడు చిత్రాలు ఈ పండక్కే రిలీజై మంచి ఫలితాన్ని అందుకున్నాయని.. పటాస్ను సైతం సంక్రాంతి సినిమాలాగే ఫీలవుతానని.. ఈ సంక్రాంతికి వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సైతం పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నానని అనిల్ చెప్పాడు. తాను ప్రయోగాలు చేయననేమీ లేదని.. ‘రాజా ది గ్రేట్’ కంటే ప్రయోగం ఏముంటుందని.. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే కూడా బాగుంటుందని అనిల్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on January 5, 2026 2:24 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…