దర్శకుడు మారుతీ మంచి ఒత్తిడిలో ఉన్నారు. ది రాజా సాబ్ విడుదల తేదీ సంవత్సరాలు, నెలల నుంచి కౌంట్ డౌన్ ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసింది. జనవరి 9 కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఒకపక్క చివరి దశ పనులు చూసుకుంటూనే ప్రమోషన్లు మిస్ కాకూడదనే ఉద్దేశంతో మారుతీ వరసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.
ఈ క్రమంగా తాను చెప్పాలనుకున్నది ఒకటి, బయటికి వస్తున్నది మరొకటి తరహాలో అర్థాలు మారిపోవడంతో ఫ్యాన్స్ కొంత కినుక వహిస్తున్నారు. డైరెక్టర్ సాబ్ కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడిన క్లిప్పులను వైరల్ చేస్తున్నారు.
ఏఐకి గ్రాఫిక్స్ కు ఉన్న తేడా, ప్రభాస్ డూపుని వాడుకునే విధానం, క్లైమాక్స్ ఘట్టం, హీరోకు తాను ఇచ్చిన ప్రాధాన్యత ఇలా పలు విషయాల గురించి మారుతీ పంచుకున్న ముచ్చట్లలో కొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. ముఖ్యంగా నేను ప్రభాస్ చెప్పినట్టే చేశాను, కోరినట్టే తీశాను అని చెప్పడం కొంత నెగటివ్ సెన్స్ లోకి వెళ్తోంది.
అంత ఇమేజ్ ఉన్న డార్లింగ్ నా మాట నమ్మి ఓకే చేసేంతగా తీశానని చెప్పుకుంటే ఎలివేషన్ అవుతుంది. అలా కాకుండా అంతా ప్రభాస్ మీదకు చెప్పడం కొందరికి రుచించడం లేదు. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నా తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రభాస్ మీద మారుతీకి చాలా కృతజ్ఞత ఉంది. అది ఈవెంట్ లో బయటపడింది కూడా.
కానీ సోషల్ మీడియా జమానాలో ఏ చిన్న పొరపాటు మాట దొర్లినా యాంటీ ఫ్యాన్స్ దాన్ని పట్టేసుకుంటారు. అదే ప్రభాస్ అభిమానులకు సంకటంగా మారింది. అసలే మారుతీ మీడియా ముందుకు వచ్చి సంవత్సరాలు గడిచిపోయాయి. పక్కా కమర్షియల్ తర్వాత మళ్ళీ కెమెరాని ఫేస్ చేయలేదు.
ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ విడుదల సమయంలో ఎలాంటి దర్శకుడికైనా కొంత నెర్వస్ నెస్ ఉంటుంది. కానీ అది మాటల్లో బయటపడితే ఒక్కోసారి ట్రోలింగ్ కి దారి తీయొచ్చు. అందుకే ముందు అవసరమైన మేరకు రెస్ట్ తీసుకుని, రిలీజయ్యాక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు కాబట్టి అప్పుడు ఓపెనైతే బెటరేమో.
This post was last modified on January 5, 2026 11:54 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…