జన నాయకుడు ట్రైలర్ వచ్చాక అందరి డౌట్లు తీరిపోయాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతూనే ఉంది కానీ టీమ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అనిల్ రావిపూడి, హెచ్ వినోత్ దీని గురించి నేరుగా స్పందించకుండా దాటవేస్తూ వచ్చారు. ఇవాళ ఫుల్ క్లారిటీ వచ్చింది.
సగం ట్రైలర్ పైగా విజువల్స్ రెండు సినిమాల్లో ఒకేలా అనిపించాయి. ఫ్యాక్టరీ ఫైట్ తో మొదలుపెట్టి జైలు ఎపిసోడ్ దాకా మక్కికి మక్కి అనిపించేంత పోలికలున్నాయి. పొలిటికల్ గా అదనపు మెరుగులు దిద్దారు కానీ ఓవరాల్ గా చూసుకుంటే సేటు టు సేమ్ అంటూ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్లు పెట్టేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎంత రీమేక్ అయినా భగవంత్ కేసరిలో ఉన్న ఇంటెన్సిటీ ఇప్పుడీ జన నాయకుడులో కనిపించలేదనే చెప్పాలి. బడ్జెట్ పరంగా పెద్దదే కావొచ్చు కానీ అనిల్ రావిపూడి టేకింగ్, బాలయ్య వయసు ప్లస్ హుందాతనం, తమన్ మ్యూజిక్ ఏవైతే మెయిన్ హైలైట్స్ గా నిలిచాయో అవి విజయ్ మూవీలో మిస్ అయినట్టుగా కనిపిస్తోంది.
పైగా బాబీ డియోల్ విలనిజంని మరింత వయొలెంట్ గా మార్చడంతో పాటు డార్క్ నైట్ తరహాలో ఏదో రోబోటిక్ తరహా పోరాట సన్నివేశాలు పెట్టడం కొంత ఆర్టిఫీషియల్ లుక్ ఇచ్చింది. ఇదంతా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసమే కావొచ్చు కానీ సగటు ఆడియన్స్ కోణం నుంచి చూస్తే ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి.
రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ఏరికోరి మరీ భగవంత్ కేసరిని ఎంచుకున్నాడు. అనిల్ రావిపూడిని పిలిపించి మరీ సూచనలు తీసుకున్నాడు. రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడిగాడట కానీ కమిట్ మెంట్ల దృష్ట్యా అనిల్ ఒప్పుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చూసిన కథనే మళ్ళీ జన నాయకుడులో మన జనాలు చూస్తారానేది వేయి డాలర్ల ప్రశ్న. స్ట్రెయిట్ సబ్జెక్టు అయ్యుంటే ఖచ్చితంగా తెలుగు సినిమాలకు కాంపిటీషన్ అయ్యేది కానీ రీమేక్ అయిపోయి ఆ ఛాన్స్ తగ్గించేసుకుంది. మరి తమిళ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on January 3, 2026 10:56 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…