తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో అతను తెలుగు ప్రేక్షకులను ఎలా నవ్వుల్లో ముంచెత్తాడో తెలిసిందే. ప్రభాస్తో తీసిన ‘రాజాసాబ్’లో సైతం కామెడీ బాగానే ఉండబోతోందని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.
ఐతే కామెడీ ఒక పార్ట్గా కాకుండా.. కేవలం కామెడీనే ప్రధానంగా ఒక సినిమా తీయాలనేది తన కల అంటున్నాడు మారుతి. తెలుగులో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్లకు తోడు.. కమల్ హాసన్ను పెట్టి ‘పంచతంత్రం’ లాంటి సినిమా తీయాలని ఉందని.. అందుకోసం సీరియస్గా ప్రయత్నం కూడా చేస్తానని అతను ఒక పాడ్ కాస్ట్లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
‘‘నేను ఒక పంచతంత్రం లాంటి సినిమా తీస్తాను.. ఆ రోజు థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. నాకు అలాంటి సినిమా రాసేంత కెపాసిటీ ఉంది. కంటెంట్ ఉంది. అలాంటిది నాకు చెయ్యాలనేది ఉంది. నాకు మల్టీస్టారర్ చేయాలని ఉంది. నలుగురు.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, కమల్ హాసన్.. ఈ ఐదుగురితో కలిసి సినిమా చేయాలన్నది నా ఆలోచన. మనకింక ఆ సినిమా అలా ఉండిపోవాలి’’ అని మారుతి వ్యాఖ్యానించాడు.
ఐతే మారుతి ఆలోచన బాగానే ఉంది కానీ.. ఈ కాంబినేషన్ను తెరపైకి తీసుకురావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. తెలుగు సీనియర్ హీరోల్లో ఇద్దరిని కలిపి సినిమా తీయడం వరకు ఓకే కానీ.. నలుగురిని ఏకతాటిపైకి తేవడమే చాలా కష్టం.
అలాంటిది వీరికి తోడు కమల్ హాసన్ అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మారుతి కల కలగానే మిగిలిపోక తప్పదేమో. కానీ ఆర్టిస్టులు ఎవరన్నది పక్కన పెడితే.. అతను ‘పంచతంత్రం’ లాంటి కామెడీ సినిమా చేస్తే మాత్రం వర్కవటువుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 3, 2026 8:28 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…