తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో అతను తెలుగు ప్రేక్షకులను ఎలా నవ్వుల్లో ముంచెత్తాడో తెలిసిందే. ప్రభాస్తో తీసిన ‘రాజాసాబ్’లో సైతం కామెడీ బాగానే ఉండబోతోందని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.
ఐతే కామెడీ ఒక పార్ట్గా కాకుండా.. కేవలం కామెడీనే ప్రధానంగా ఒక సినిమా తీయాలనేది తన కల అంటున్నాడు మారుతి. తెలుగులో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్లకు తోడు.. కమల్ హాసన్ను పెట్టి ‘పంచతంత్రం’ లాంటి సినిమా తీయాలని ఉందని.. అందుకోసం సీరియస్గా ప్రయత్నం కూడా చేస్తానని అతను ఒక పాడ్ కాస్ట్లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
‘‘నేను ఒక పంచతంత్రం లాంటి సినిమా తీస్తాను.. ఆ రోజు థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. నాకు అలాంటి సినిమా రాసేంత కెపాసిటీ ఉంది. కంటెంట్ ఉంది. అలాంటిది నాకు చెయ్యాలనేది ఉంది. నాకు మల్టీస్టారర్ చేయాలని ఉంది. నలుగురు.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, కమల్ హాసన్.. ఈ ఐదుగురితో కలిసి సినిమా చేయాలన్నది నా ఆలోచన. మనకింక ఆ సినిమా అలా ఉండిపోవాలి’’ అని మారుతి వ్యాఖ్యానించాడు.
ఐతే మారుతి ఆలోచన బాగానే ఉంది కానీ.. ఈ కాంబినేషన్ను తెరపైకి తీసుకురావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. తెలుగు సీనియర్ హీరోల్లో ఇద్దరిని కలిపి సినిమా తీయడం వరకు ఓకే కానీ.. నలుగురిని ఏకతాటిపైకి తేవడమే చాలా కష్టం.
అలాంటిది వీరికి తోడు కమల్ హాసన్ అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మారుతి కల కలగానే మిగిలిపోక తప్పదేమో. కానీ ఆర్టిస్టులు ఎవరన్నది పక్కన పెడితే.. అతను ‘పంచతంత్రం’ లాంటి కామెడీ సినిమా చేస్తే మాత్రం వర్కవటువుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 3, 2026 8:28 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…