పైకేమో ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి.. అన్ని సినిమాలు ఆడాలి అంటూ సినీ జనాలు స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ.. తెర వెనుక మాటలు వేరే ఉంటాయన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. పోటీ ఉన్నపుడు అవతలి సినిమా పోవాలని కోరుకునేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. కొన్ని సినిమాలకు వ్యతిరేకంగా నెగెటివ్ క్యాంపైనింగ్ చేయించే వాళ్లూ లేకపోలేదు.
సంక్రాంతికి ఈసారి విపరీతమైన పోటీ ఉండగా.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఫ్లాప్ కావాలని ఇండస్ట్రీలోనే కొన్ని వర్గాలు కోరుకుంటున్నట్లుగా ఓ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్లనూ చూడొచ్చు. ఇదే విషయం మీద దీని దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.
రాజాసాబ్ ఫ్లాప్ కావాలని సినీ జనాలు కోరుకోవడంలో ఆయన ఒక పాజిటివ్ కోణాన్నే చూశాడు. ఈ సినిమా బాగా ఆడితే తాను దొరకనేమో ఉద్దేశంతో కొందరు ఫ్లాప్ కావాలని కోరుకుంటూ ఉండొచ్చని మారుతి వ్యాఖ్యానించడం విశేషం.
”ఈర్ష్య, అసూయ మానవ నైజం. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కోరుకుంటూ ఉంటారు. పక్కింటి వాళ్లు కారు కొనుక్కుంటే దానికి ఏదైనా అవ్వాలని కోరుకోవచ్చు. నేను సక్సెస్ అయ్యి ఎదిగితే వాళ్లకు దొరకనేమో అనే భయంతో నా సినిమా ఫ్లాప్ కావాలని కొందరు అనుకోవచ్చు. నేను ఇప్పుడు చిన్న సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు వెళ్తున్నా. ఒకవేళ నాకు భారీ సక్సెస్ వస్తే.. అలా రానేమో అని వాళ్ల భయం కావచ్చు.
ఈసారి కథ చెబుదామని నా దగ్గరికి వస్తే నేను పట్టించుకోనని వాళ్లు అనుకుంటారు. అదే ఫెయిలైతే మనల్ని చూస్తాడని వాళ్లు భావిస్తారు. వాళ్లు అసూయ వల్ల అలా అనుకుంటారేమో కానీ.. నేను అలా ఆలోచించేవాడిని కాదు. నేనెప్పుడూ స్టార్డం శాశ్వతం అనుకోను. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలని అనుకుంటే అలాగే తీస్తాను.
నా దగ్గర చాలా కథలున్నాయి. పెద్ద స్టార్తో సినిమా చేశా కదా.. అన్నీ ఆ స్థాయిలోనే ఉండాలనే కోరికలు నాకు లేవు. నాకు కథ ముఖ్యం. ఏ హీరో సెట్ అయితే తనతోనే తీస్తా. ఎవరితో చేసినా ఎప్పుడూ పని ఉండాలని మాత్రం కోరుకుంటా” అని మారుతి స్పష్టం చేశాడు.
This post was last modified on January 2, 2026 7:49 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…