మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చిన్మయి కూడా గట్టిగానే గళం విప్పినప్పటికీ.. ఆమె తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ అనసూయ మాత్రం ఊరుకోలేదు.
శివాజీతో మాటల యుద్ధాన్ని కొనసాగించింది. సోషల్ మీడియాలో అనసూయ మీద నెటిజన్లు పెద్ద ఎత్తునే దండెత్తి వచ్చినా.. ఆమెను విపరీతంగా ట్రోల్ చేసినా ఆమె తగ్గలేదు. ప్రకాష్ రాజ్ సహా కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. వారం రోజుల అవిశ్రాంతంగా పోరాడిన అనసూయ.. చిన్న గ్యాప్ తీసుకుని, తనదైన శైలిలో ఒక సోషల్ మీడియా పోస్టుతో తన ట్రోలర్స్కు పంచ్ వేసింది.
కొత్త ఏడాది నేపథ్యంలో తన భర్త భరద్వాజ్తో కలిసి అనసూయ వెకేషన్కు వెళ్లింది. ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సముద్రంలో జలకాలాడుతున్న తన ఫొటోలను చూస్తే.. ఎవరేమనుకున్నా, విమర్శలు చేసినా తాను తగ్గేది లేదనే సంకేతాలు ఇస్తున్నట్లే ఉంది. వెకేషన్కు వెళ్లి బికినీల్లో ఫొటోలకు పోజులివ్వడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు.
కానీ శివాజీ వివాదం నేపథ్యంలో తన కొత్త ఫొటోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మహిళల వస్త్రధారణ గురించి చర్చ జరుగుతున్న టైంలో తన ఛాయిస్ తనదే అని చాటి చెబుతూ ఆమె అందాల ప్రదర్శన చేస్తున్న ఫొటోలను పంచుకుని తన దారి తనదే అని చెప్పకనే చెప్పింది. తన డ్రెస్సింగ్, హాట్ లుక్ గురించి ఎప్పట్లాగే కామెంట్లు వస్తున్నప్పటికీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదని వేరే చెప్పాలా?
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…