మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చిన్మయి కూడా గట్టిగానే గళం విప్పినప్పటికీ.. ఆమె తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ అనసూయ మాత్రం ఊరుకోలేదు.
శివాజీతో మాటల యుద్ధాన్ని కొనసాగించింది. సోషల్ మీడియాలో అనసూయ మీద నెటిజన్లు పెద్ద ఎత్తునే దండెత్తి వచ్చినా.. ఆమెను విపరీతంగా ట్రోల్ చేసినా ఆమె తగ్గలేదు. ప్రకాష్ రాజ్ సహా కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. వారం రోజుల అవిశ్రాంతంగా పోరాడిన అనసూయ.. చిన్న గ్యాప్ తీసుకుని, తనదైన శైలిలో ఒక సోషల్ మీడియా పోస్టుతో తన ట్రోలర్స్కు పంచ్ వేసింది.
కొత్త ఏడాది నేపథ్యంలో తన భర్త భరద్వాజ్తో కలిసి అనసూయ వెకేషన్కు వెళ్లింది. ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సముద్రంలో జలకాలాడుతున్న తన ఫొటోలను చూస్తే.. ఎవరేమనుకున్నా, విమర్శలు చేసినా తాను తగ్గేది లేదనే సంకేతాలు ఇస్తున్నట్లే ఉంది. వెకేషన్కు వెళ్లి బికినీల్లో ఫొటోలకు పోజులివ్వడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు.
కానీ శివాజీ వివాదం నేపథ్యంలో తన కొత్త ఫొటోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మహిళల వస్త్రధారణ గురించి చర్చ జరుగుతున్న టైంలో తన ఛాయిస్ తనదే అని చాటి చెబుతూ ఆమె అందాల ప్రదర్శన చేస్తున్న ఫొటోలను పంచుకుని తన దారి తనదే అని చెప్పకనే చెప్పింది. తన డ్రెస్సింగ్, హాట్ లుక్ గురించి ఎప్పట్లాగే కామెంట్లు వస్తున్నప్పటికీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదని వేరే చెప్పాలా?
This post was last modified on January 2, 2026 7:40 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…