మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చిన్మయి కూడా గట్టిగానే గళం విప్పినప్పటికీ.. ఆమె తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ అనసూయ మాత్రం ఊరుకోలేదు.
శివాజీతో మాటల యుద్ధాన్ని కొనసాగించింది. సోషల్ మీడియాలో అనసూయ మీద నెటిజన్లు పెద్ద ఎత్తునే దండెత్తి వచ్చినా.. ఆమెను విపరీతంగా ట్రోల్ చేసినా ఆమె తగ్గలేదు. ప్రకాష్ రాజ్ సహా కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. వారం రోజుల అవిశ్రాంతంగా పోరాడిన అనసూయ.. చిన్న గ్యాప్ తీసుకుని, తనదైన శైలిలో ఒక సోషల్ మీడియా పోస్టుతో తన ట్రోలర్స్కు పంచ్ వేసింది.
కొత్త ఏడాది నేపథ్యంలో తన భర్త భరద్వాజ్తో కలిసి అనసూయ వెకేషన్కు వెళ్లింది. ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సముద్రంలో జలకాలాడుతున్న తన ఫొటోలను చూస్తే.. ఎవరేమనుకున్నా, విమర్శలు చేసినా తాను తగ్గేది లేదనే సంకేతాలు ఇస్తున్నట్లే ఉంది. వెకేషన్కు వెళ్లి బికినీల్లో ఫొటోలకు పోజులివ్వడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు.
కానీ శివాజీ వివాదం నేపథ్యంలో తన కొత్త ఫొటోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మహిళల వస్త్రధారణ గురించి చర్చ జరుగుతున్న టైంలో తన ఛాయిస్ తనదే అని చాటి చెబుతూ ఆమె అందాల ప్రదర్శన చేస్తున్న ఫొటోలను పంచుకుని తన దారి తనదే అని చెప్పకనే చెప్పింది. తన డ్రెస్సింగ్, హాట్ లుక్ గురించి ఎప్పట్లాగే కామెంట్లు వస్తున్నప్పటికీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదని వేరే చెప్పాలా?
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…