లెజెండరీ నటుడు సాయికుమార్ వారసత్వాన్నందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆది సాయికుమార్కు కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి మంచి సినిమాలే పడ్డాయి. కానీ తర్వాత అతడికి కలిసి రాలేదు. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఆది ఎంతగా వెనుకబడ్డాడంటే.. ఒక దశ దాటాక తన సినిమాలు థియేటర్లలో రిలీజవడమే గగనం అయిపోయింది. ఒకవేళ రిలీజైనా జనం పట్టించుకోవడమూ మానేశారు.
ఐతే విశేషం ఏంటంటే.. తన సినిమాలకు ఓటీటీల్లో మంచి స్పందన వస్తోంది చాలా ఏళ్లుగా. తెలుగుతో పాటు వేరే భాషల వాళ్లూ తన సినిమాలు చూస్తున్నారు. థియేటర్లలో అసలేమాత్రం ప్రభావం చూపని చిత్రాలకు మంచి రేటు ఇచ్చి తీసుకున్నాయి ఓటీటీ సంస్థలు. డిజిటల్ బిజినెస్ బాగా డల్ అయ్యాక కూడా ఆది సినిమాలు మాత్రం అక్కడ మంచి రేటుకు సేల్ కావడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
ఐతే ఓటీటీలో ఎంత డిమాండ్ ఉన్నా సరే.. థియేటర్లలో సినిమా ఆడితేనే ఒక హీరోకు విలువ. ఆ సక్సెస్ కోసమే ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నాడు ఆది. అతను ‘శంబాల’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. కొడుకు విజయం కోసం ఎదురు చూస్తున్న సాయికుమార్ సైతం ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీళ్లిద్దరి నమ్మకం నిలబడి ‘శంబాల’ బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలిచింది. ఆది గత చిత్రాలను అస్సలు పట్టించుకోని ఆడియన్స్.. ప్రోమోలు బాగుండడంతో ‘శంబాల’ పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. సినిమాకు టాక్ కూడా డీసెంట్ గా వచ్చింది.
దీంతో క్రిస్మస్ సెలవులను సినిమా బాగా ఉపయోగించుకుంది. మంచి వసూళ్లతో సాగింది. వీకెండ్లోనే చాలా ఏరియాల్లో ‘బ్రేక్ ఈవెన్’కు వచ్చేసింది ‘శంబాల’. వీక్ డేస్లో కూడా ఓ మోస్తరుగా పెర్ఫామ్ చేస్తోంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు సినిమా థియేటర్లలో బాగానే నిలబడేలా ఉంది. మొత్తానికి ఇన్ని రోజులు ఓటీటీ హీరోగా ఉన్న ఆది.. ‘శంబాల’తో మళ్లీ థియేటర్ హీరోగా నిలబడుతుండడంతో తన కుటుంబానికి అమితానందాన్నిచ్చేదే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…