‘రాజాసాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. ‘రాజాసాబ్’ ముందు వరకు మారుతి తీసినవన్నీ చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే. పైగా అతను ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ప్రభాస్ తనతో సినిమా చేయడానికి ముందుకు రావడం చిన్న విషయం కాదు.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ‘రాజాసాబ్’ కోసం అతను ప్రాణం పెట్టినట్లే కనిపిస్తోంది ప్రోమోలు చూస్తే. ఈ సినిమా విషయంలో మారుతి మామూలు కాన్ఫిడెంట్గా లేడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నపుడు.. సినిమా ఒక్క శాతం కూడా నిరాశపరచనది చెబుతూ, తన ఇంటి అడ్రస్ వివరాలు చెప్పి, నిరాశ పడ్డ వాళ్లు తన ఇంటికి వచ్చి నిలదీయవచ్చని అన్నాడు.
ఐతే మారుతి ఒక పర్పస్తో తన ఇంటి అడ్రస్ చెబితే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకో పని కోసం దాన్ని వాడేసుకున్నారు. ‘రాజాసాబ్’ ట్రైలర్ చూసి ఎంతో ఇంప్రెస్ అయిన రెబల్ ఫ్యాన్స్.. మారుతి మీద అభిమానంతో అతడికి బిరియానీలు పార్శిల్ పంపించారు. ఆ పార్శిల్స్ చూసి మారుతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన మారుతి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. వాళ్లకు తన వైపు నుంచి జనవరి 9న రివర్స్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నాడు.
‘రాజాసాబ్’ ఎక్స్ హ్యాండిల్లోనూ దీనిపై స్పందించారు. మారుతి ఇంటి అడ్రస్ ఇచ్చింది ఎందుకు.. మీరు దాన్ని ఎందుకోసం వాడారు అంటూ సరదా కామెంట్ పెట్టారు. తనతో పని చేసేవాళ్లకు కడుపు నిండా ఫుడ్డు పెట్టి చంపేస్తుంటాడని ప్రభాస్కు పేరుంది. మారుతికి బిరియానీలు పంపించడం చూస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన కథానాయకుడికి ఏమాత్రం తీసిపోరంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…