బాలకృష్ణ, బోయపాటి శీనుల బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొనసాగిస్తుందని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నఅఖండ 2 తాండవం వాటిని నీరు గార్చిన మాట వాస్తవం. అలాని డిజాస్టర్ అందామా ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే యుఎస్ లో ఆలస్యంగా అయినా వన్ మిలియన్ దాటేసింది.
ఇది బ్రేక్ ఈవెన్ కి దూరమే కానీ ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే ఎంతో కొంత నష్టాల శాతం తగ్గినట్టే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తర్వాత వరసగా అయిదో వంద కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇలాంటి నెగటివ్ టాక్ తో మూడో వారం వీకెండ్ లో స్టడీగా ఉండటం మాములు విషయం కాదు.
ఇవాళ్టికి కూడా బుక్ మై షోలో గంటకు సగటున రెండు వేల దాకా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒకటే స్క్రీన్ ఆడిస్తున్న చాలా సెంటర్స్ లో ఆదివారం హౌస్ ఫుల్స్ పడ్డాయి. వీక్ డేస్ నెంబర్లు పెద్దగా లేనప్పటికీ క్రిస్మస్ లాంటి సెలవుల్లో ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు.
అయితే దర్శకుడు బోయపాటి శీనుకు బాలయ్యతో తన కాంబో స్టామినా మరోసారి అర్థమై ఉంటుంది. ఇక్కడో పాయింట్ మాట్లాడుకోవాలి. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుల్లో మొదటి పేరు కోడి రామకృష్ణది. మంగమ్మ గారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, బాల గోపాలుడు ఇవన్నీ ఓ రేంజ్లో ఆడిన సూపర్ హిట్లు.
ఆ తర్వాత బి గోపాల్ గురించి అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. పలనాటి బ్రహ్మనాయుడు వీళ్ళ కలయికకు బ్రేక్ వేసింది. బోయపాటి శీనును వీళ్ళ సరసన చేరే అవకాశాన్ని తృటిలో జార్చుకున్నారు.
ఒకవేళ అఖండ తాండవం 2 కనక అంచనాలు అందుకుని ఉంటే కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ కళ్లజూసేది. అలా జరగకనే శంబాల, ఈషా లాంటి చిన్న సినిమాలు ఈ వారం డామినేట్ చేశాయి. అయినా సరే బోయపాటి సరైన కంటెంట్ తో వస్తే మళ్ళీ మేజిక్ చేయొచ్చు.
This post was last modified on December 28, 2025 8:51 pm
ఇంకో మూడు రోజుల్లో 2025 అయిపోతుంది. అక్కడి నుంచి సంక్రాంతి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈసారి ఎక్కువ సినిమాలు ఉండటంతో…
ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ ఏడాదిలో తొలిసారి ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అయోధ్య రామజన్మభూమిని సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి…
ఏడాది చివర్లో వచ్చిన క్రిస్మస్ ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊహించని ఫలితాలు ఇచ్చింది. పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ ప్రేక్షకుల…
తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎంపికయ్యారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఏకంగా…
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీకి హాజరు కానున్నారా? సుదీర్ఘకాలం తర్వాత.. ఆయన సభలో తన గళం వినిపించను న్నారా?…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే కూటమిలోని మూడు…