బాలకృష్ణ, బోయపాటి శీనుల బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొనసాగిస్తుందని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నఅఖండ 2 తాండవం వాటిని నీరు గార్చిన మాట వాస్తవం. అలాని డిజాస్టర్ అందామా ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే యుఎస్ లో ఆలస్యంగా అయినా వన్ మిలియన్ దాటేసింది.
ఇది బ్రేక్ ఈవెన్ కి దూరమే కానీ ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే ఎంతో కొంత నష్టాల శాతం తగ్గినట్టే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తర్వాత వరసగా అయిదో వంద కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇలాంటి నెగటివ్ టాక్ తో మూడో వారం వీకెండ్ లో స్టడీగా ఉండటం మాములు విషయం కాదు.
ఇవాళ్టికి కూడా బుక్ మై షోలో గంటకు సగటున రెండు వేల దాకా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒకటే స్క్రీన్ ఆడిస్తున్న చాలా సెంటర్స్ లో ఆదివారం హౌస్ ఫుల్స్ పడ్డాయి. వీక్ డేస్ నెంబర్లు పెద్దగా లేనప్పటికీ క్రిస్మస్ లాంటి సెలవుల్లో ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు.
అయితే దర్శకుడు బోయపాటి శీనుకు బాలయ్యతో తన కాంబో స్టామినా మరోసారి అర్థమై ఉంటుంది. ఇక్కడో పాయింట్ మాట్లాడుకోవాలి. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుల్లో మొదటి పేరు కోడి రామకృష్ణది. మంగమ్మ గారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, బాల గోపాలుడు ఇవన్నీ ఓ రేంజ్లో ఆడిన సూపర్ హిట్లు.
ఆ తర్వాత బి గోపాల్ గురించి అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. పలనాటి బ్రహ్మనాయుడు వీళ్ళ కలయికకు బ్రేక్ వేసింది. బోయపాటి శీనును వీళ్ళ సరసన చేరే అవకాశాన్ని తృటిలో జార్చుకున్నారు.
ఒకవేళ అఖండ తాండవం 2 కనక అంచనాలు అందుకుని ఉంటే కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ కళ్లజూసేది. అలా జరగకనే శంబాల, ఈషా లాంటి చిన్న సినిమాలు ఈ వారం డామినేట్ చేశాయి. అయినా సరే బోయపాటి సరైన కంటెంట్ తో వస్తే మళ్ళీ మేజిక్ చేయొచ్చు.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…