Movie News

శివాజీ మార్పు దండోరాకు ప్లస్ అవుతుందా

నిన్న విడుదలైన దండోరాకు ప్రశంసలైతే వచ్చాయి కానీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఛాంపియన్, శంభాల, ఈషా ట్రెండింగ్ లో ఉండగా దండోరా మాత్రం రేస్ లో వెనుకబడిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ ను ఉద్దేశించి శివాజీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో చూశాం.

తర్వాత ఆయన పబ్లిక్ గా క్షమాపణ కోరడం, మహిళా కమీషన్ కు వెళ్లి వివరణ ఇస్తానని చెప్పడం జరిగిపోయాయి. అయినా సరే సోషల్ మీడియాలో చర్చ ఆగలేదు. మాములుగా ఇలాంటి నెగటివ్ విషయాలు సినిమా ప్రమోషన్లకు ఉపయోగపడతాయి. కానీ దండోరాకు ఇది జరగలేదని టీమ్ గుర్తించింది.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు వద్దని, మంచి సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకుంటానని, థియేటర్లకు వెళ్లి జనాలను కలుసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే కేవలం శివాజీ విజిట్ చేసినంత మాత్రాన ఫుట్ ఫాల్స్ పెరుగుతాయా అంటే అంతకన్నా ఆప్షన్ వేరొకటి లేదు.

ఎందుకంటే దండోరా క్యాస్టింగ్ మొత్తంలో జనం గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు ముగ్గురే. వాళ్ళు శివాజీ, నవదీప్, బిందు మాధవి. సో పబ్లిక్ లోకి వెళ్తే పబ్లిసిటీ పరంగా ఉపయోగపడొచ్చని భావించి ఉండొచ్చు, క్రిస్మస్ సినిమాలు అన్నింటికి దాదాపు ఒకే రేటింగ్స్, రివ్యూస్ వచ్చాయి.

కానీ దండోరా వాటిని క్యాష్ చేసుకోలేకపోయింది. సో ఇప్పుడీ వీకెండ్ చాల కీలకం. నిజానికి శివాజీ ఇందులో కోర్టుని మించిన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ అది జనంలో పూర్తి స్థాయిలో రీచ్ అవ్వలేదు. కోర్ట్ నిర్మాతగా నాని దాన్ని ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్లాడో చూశాం. కానీ దండోరాకు ఆ అవకాశం లేదు. అలాంటి బ్యాకప్ లేదు.

సో బరువంతా కంటెంట్ మీదే పడింది. సినిమాలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ బాగానే తీశారనే మాట దండోరాకు వచ్చింది. దాన్ని నిలబెట్టుకుని కలెక్షన్లుగా మార్చుకోవాలి. కాంపిటేషన్ వల్ల థియేటర్లు పరిమితంగానే దొరికినా ఆడియన్స్ మద్దతు దొరికితే ఆటోమేటిక్ గా పెంచొచ్చు.

This post was last modified on December 26, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అక్కడ ‘పవన్’ పేరు బాగా వినిపిస్తుంది

గ్రామీణ భార‌తంపై జ‌న‌సేన సైలెంట్ వేవ్‌తో దూసుకుపోతోందా? ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే ప‌రిమితం అయిన జ‌న‌సేన ఇప్పుడు గ్రామీణ…

56 minutes ago

కమిన్స్ రేంజ్ లో సైలెంట్ చేస్తాడట

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs…

1 hour ago

మైత్రి దగ్గరే దేవికి ఈ పంచాయితీ ఏంటో?

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌ది సపరేట్ స్టయిల్. కొంచెం టైం తీసుకుని అయినా ప్రత్యేకమైన పాటలు, బీజీఎం ఇవ్వాలని…

1 hour ago

మిర్చి అందాలతో పర్యాటక అభివృద్ధి?

ఆకాశం నుంచి చూస్తే భూమంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే గుంటూరు మిర్చి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా…

1 hour ago

భార్యతో విజయ్ భారీ డీల్?

ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా…

2 hours ago

మార్చి గురించి ఏదేదో ఊహించుకుంటే..

పోయినేడాది వేసవి పెద్ద సినిమాలు లేక వెలవెలబోయింది. కానీ ఈసారి సమ్మర్ మాత్రం అలా ఉండదనే సంకేతాలు కనిపించాయి. వేసవి…

3 hours ago