క్రిస్మస్ ఫెస్టివల్ ఇవాళ మినీ సంక్రాంతిని తలపించేసింది. ఏకంగా అరడజనుకు పైగా రిలీజులతో థియేటర్లు కళకళలడాయి. టాక్స్ సంగతి పక్కనపెడితే సెలవు రోజు ఏదోకటి చూద్దామని ఫిక్స్ అయిపోయిన ఆడియన్స్ పొలోమని టికెట్లు కొనేసుకుని వెళ్లిపోయారు. దెబ్బకు అఖండ తాండవం 2, అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ అయ్యాయి.
ఛాంపియన్, శంభాల, ఈషాలకు మంచి ఆక్యుపెన్సీలు కనిపించగా దండోరా ఇంకా పికప్ కావాల్సి ఉంది. వసూళ్ల కన్నా ప్రశంసలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గొడవలో మోహన్ లాల్ వృషభ కూడా ఉంది.
నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా థియేటర్లకు వచ్చిన సంగతే ఆడియన్స్ కి రిజిస్టర్ కానంత వీక్ ప్రమోషన్లు చేసుకుంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పటికీ సరిపడా షోలు, థియేటర్లు దొరకలేదని ట్రేడ్ టాక్. కారణం కనీస బజ్ లేకపోవడమే.
మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేసిన వృషభకు రిపోర్ట్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ, పాత తరహా కథా కథనాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తోంది. వేసిన ఒకటి రెండు షోలు కూడా కనీస జనాలు లేక క్యాన్సిల్ చేసి వేరే సినిమాలకు ఇచ్చేసిన దాఖాలాలున్నాయని బయ్యర్స్ టాక్.
నిజానికి మోహన్ లాల్ కొంత చొరవ తీసుకుని హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో భాగమై ఉంటే వృషభ కనీసం రిజిస్టర్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ఎల్2 ఎంపురాన్ విషయంలో కనిపించిన శ్రద్ధ వృషభకు మిస్ అయ్యింది. తెలుగు జనాలకు పరిచయమున్న ఆర్టిస్టులు లేకపోవడం, ట్రైలర్ కట్ మాములుగా అనిపించడం లాంటి కారణాలు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించాయి.
కేరళలో బోణీ బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో పరిస్థితి అంతంతమాత్రమే. వరస హిట్లతో దూసుకుపోతున్న మోహన్ లాల్ కు ఈ వృషభ స్పీడ్ బ్రేకర్ అవుతుందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. చూడాలి మరి ఏం చేస్తుందో.
This post was last modified on December 25, 2025 11:29 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…