కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను ఇంచుమించు ఒకే సమస్య వేధిస్తోంది. కరుప్పు విడుదల ఎప్పుడో అర్థం కాక సూర్య ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఏకంగా వాళ్లే స్వంతంగా పోస్టర్లు తయారు చేసుకుని సంక్రాంతికి రిలీజ్ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాయర్, దేవుడిగా రెండు క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయనే టాక్ ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు తప్ప ఫలానా డేట్ అని ఖచ్చితంగా చెప్పడం లేదు. జనవరి నెలాఖరు అంటున్నా దానికీ గ్యారెంటీ లేదు.
ఇంకోవైపు కార్తీ వా వతియర్ (అన్నగారు వస్తారు) ఆర్థిక చిక్కులో పడి కోర్టు వేసిన మొట్టికాయ వల్ల ఆగిపోయింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా కనీసం ఇరవై కోట్లు సిద్ధం చేసుకోనిదే వ్యవహారం తేలేలా లేదు. డిసెంబర్ 5 రిలీజవుతుందని టీమ్ ప్రమోషన్లు చేసింది. కార్తీ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్లు కూడా అమ్మారు. మరికొన్ని గంటల్లో షోలు అనగా అఖండ 2 తరహాలో చివరి నిమిషం బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 2026 వేసవి కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదని చెన్నై టాక్. ఈ పరిణామాల పట్ల తీవ్ర అసహనంగా ఉన్న కార్తీ ఏమి చేయలేని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
సూర్య బ్రదర్స్ కు సక్సెస్ చాలా అవసరం. ఇద్దరూ వరస ఫ్లాపుల్లో ఉన్నారు. మార్కెట్ తగ్గిపోయింది. బయటికి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా నిర్మాతల ఆర్థిక సమస్యలు వీళ్లకు ఇబ్బందిగా పరిణమించాయి. సితార సంస్థ నిర్మిస్తున్న సూర్య కొత్త సినిమా ఆల్రెడీ అయిపోయింది. ఇటీవల గుమ్మడికాయ కొట్టేశారు. దీన్ని సమ్మర్ లో విడుదల చేయాలని ఆలోచన. ఇంకోవైపు కార్తీ సర్దార్ 2 ఆగి ఆగి సాగుతోంది. మొన్న దీపావళికే రిలీజ్ అన్నారు కానీ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. ఈ సమస్యల నుంచి బయట పడి ఎపుడు ఇవన్నీ మోక్షం దక్కించుకుంటాయో కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on December 22, 2025 2:25 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…