బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షుకులను మరోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు మణిరత్నం. పేరుకు అది సౌత్ మూవీనే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అయింది. ఆ చిత్రంలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే.
ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే.. మణిరత్నం ఇంకా అద్భుతంగా వాటిని చిత్రీకరించారు. ఆ పాటల్లో ‘ఉయిరే ఉయిరే’ (తెలుగులో ఉరికే చిలకా) చాలా స్పెషల్. సముద్రపు ఒడ్డున అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో హృదయానికి హత్తుకునేలా మణిరత్నం ఆ పాటను చిత్రీకరించగా.. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా చక్కటి హావభావాలతో ఆ పాట ఫీల్ను ఇంకా పెంచారు.
ఈ పాటకు అంత అందం రావడంలో లొకేషన్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సాంగ్ తీసింది కేరళలోని కాసర్గడ్ సమీపంలో ఉన్న బెకాల్ బీచ్లో. అక్కడ ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ వేడుకకు ‘బొంబాయి’ టీం హాజరైంది. దర్శకుడు మణిరత్నం, హీరోయిన్ మనీషా కొయిరాలా, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ వేడుకకు హాజరైన సందర్భంగా ‘ఉయిరే ఉయిరే’ పాట తీసిన లొకేషన్కు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురూ నోస్టాల్జిగ్గా ఫీలయ్యారు. ఎమోషనల్ అయ్యారు. ‘బొంబాయి’ సినిమాకు ఉయిరే ఉయిరే పాట ప్రాణం పోసిందని.. బెకాల్లో తీయడం వల్లే ఆ పాటకు అంత అందం వచ్చిందని మణిరత్నం తెలిపాడు. ఆ లొకేషన్ చూడగానే పాటకు అవసరమైన మూడ్ వచ్చేసిందని ఆయన చెప్పారు.
ఇక్కడ షూటింగ్ చేసిన అనుభవాలను మనీషా కూడా గుర్తు చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం గొప్పగా అనిపిస్తోందని.. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అందంగా మెయింటైన్ చేస్తుండడం గొప్ప విషయమని రాజీవ్ మీనన్ తెలిపాడు. ‘ఉయిరే ఉయిరే’ పాటతో ఈ లొకేషన్కు ఎనలేని గుర్తింపు వచ్చి.. ఇదొక ఐకానిక్ మాన్యుమెంట్గా మారిందని నిర్వాహకులు తెలిపారు.
This post was last modified on December 21, 2025 4:51 pm
మాములుగా ఎంత స్టార్ హీరో అయినా ఫ్లాప్ టాక్ వస్తే నిలదొక్కుపోవడం చాలా కష్టం. కానీ అఖండ తాండవం 2కి…
వరల్డ్ కప్ అనగానే అందరూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ గురించే హైప్ ఎక్కించుకుంటారు. కానీ అసలు సినిమా గ్రూప్ స్టేజ్…
ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో…
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు.…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’…