బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షుకులను మరోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు మణిరత్నం. పేరుకు అది సౌత్ మూవీనే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అయింది. ఆ చిత్రంలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే.
ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే.. మణిరత్నం ఇంకా అద్భుతంగా వాటిని చిత్రీకరించారు. ఆ పాటల్లో ‘ఉయిరే ఉయిరే’ (తెలుగులో ఉరికే చిలకా) చాలా స్పెషల్. సముద్రపు ఒడ్డున అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో హృదయానికి హత్తుకునేలా మణిరత్నం ఆ పాటను చిత్రీకరించగా.. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా చక్కటి హావభావాలతో ఆ పాట ఫీల్ను ఇంకా పెంచారు.
ఈ పాటకు అంత అందం రావడంలో లొకేషన్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సాంగ్ తీసింది కేరళలోని కాసర్గడ్ సమీపంలో ఉన్న బెకాల్ బీచ్లో. అక్కడ ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ వేడుకకు ‘బొంబాయి’ టీం హాజరైంది. దర్శకుడు మణిరత్నం, హీరోయిన్ మనీషా కొయిరాలా, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ వేడుకకు హాజరైన సందర్భంగా ‘ఉయిరే ఉయిరే’ పాట తీసిన లొకేషన్కు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురూ నోస్టాల్జిగ్గా ఫీలయ్యారు. ఎమోషనల్ అయ్యారు. ‘బొంబాయి’ సినిమాకు ఉయిరే ఉయిరే పాట ప్రాణం పోసిందని.. బెకాల్లో తీయడం వల్లే ఆ పాటకు అంత అందం వచ్చిందని మణిరత్నం తెలిపాడు. ఆ లొకేషన్ చూడగానే పాటకు అవసరమైన మూడ్ వచ్చేసిందని ఆయన చెప్పారు.
ఇక్కడ షూటింగ్ చేసిన అనుభవాలను మనీషా కూడా గుర్తు చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం గొప్పగా అనిపిస్తోందని.. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అందంగా మెయింటైన్ చేస్తుండడం గొప్ప విషయమని రాజీవ్ మీనన్ తెలిపాడు. ‘ఉయిరే ఉయిరే’ పాటతో ఈ లొకేషన్కు ఎనలేని గుర్తింపు వచ్చి.. ఇదొక ఐకానిక్ మాన్యుమెంట్గా మారిందని నిర్వాహకులు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…