బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షుకులను మరోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు మణిరత్నం. పేరుకు అది సౌత్ మూవీనే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అయింది. ఆ చిత్రంలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే.
ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే.. మణిరత్నం ఇంకా అద్భుతంగా వాటిని చిత్రీకరించారు. ఆ పాటల్లో ‘ఉయిరే ఉయిరే’ (తెలుగులో ఉరికే చిలకా) చాలా స్పెషల్. సముద్రపు ఒడ్డున అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో హృదయానికి హత్తుకునేలా మణిరత్నం ఆ పాటను చిత్రీకరించగా.. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా చక్కటి హావభావాలతో ఆ పాట ఫీల్ను ఇంకా పెంచారు.
ఈ పాటకు అంత అందం రావడంలో లొకేషన్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సాంగ్ తీసింది కేరళలోని కాసర్గడ్ సమీపంలో ఉన్న బెకాల్ బీచ్లో. అక్కడ ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ వేడుకకు ‘బొంబాయి’ టీం హాజరైంది. దర్శకుడు మణిరత్నం, హీరోయిన్ మనీషా కొయిరాలా, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ వేడుకకు హాజరైన సందర్భంగా ‘ఉయిరే ఉయిరే’ పాట తీసిన లొకేషన్కు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురూ నోస్టాల్జిగ్గా ఫీలయ్యారు. ఎమోషనల్ అయ్యారు. ‘బొంబాయి’ సినిమాకు ఉయిరే ఉయిరే పాట ప్రాణం పోసిందని.. బెకాల్లో తీయడం వల్లే ఆ పాటకు అంత అందం వచ్చిందని మణిరత్నం తెలిపాడు. ఆ లొకేషన్ చూడగానే పాటకు అవసరమైన మూడ్ వచ్చేసిందని ఆయన చెప్పారు.
ఇక్కడ షూటింగ్ చేసిన అనుభవాలను మనీషా కూడా గుర్తు చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం గొప్పగా అనిపిస్తోందని.. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అందంగా మెయింటైన్ చేస్తుండడం గొప్ప విషయమని రాజీవ్ మీనన్ తెలిపాడు. ‘ఉయిరే ఉయిరే’ పాటతో ఈ లొకేషన్కు ఎనలేని గుర్తింపు వచ్చి.. ఇదొక ఐకానిక్ మాన్యుమెంట్గా మారిందని నిర్వాహకులు తెలిపారు.
This post was last modified on December 21, 2025 4:51 pm
బాహుబలి మూవీతో ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు ప్రభాస్. కానీ దానికి ఫాలో అప్గా…
కన్నడ నుంచి వచ్చే కథానాయికలకు తెలుగు పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంటుంది. అటు అభినయంతో మెప్పిస్తూనే ఇటు గ్లామర్ పరంగా…
మన శంకరవరప్రసాద్ గారుతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటి కొత్త సినిమా 'క' దర్శకులు సుజిత్…
గత ఏడాది సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాంతో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ ఏడాది మన శంకర…
బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు నమోదు విధానంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న కీలక నిర్ణయంతో మాన్యువల్…