పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొటెన్షియాలిటీకి తగిన సినిమాలు చేయట్లేదని.. సరైన కథలు ఎంచుకోవట్లేదని.. ట్రెండీ డైరెక్టర్లతో జట్టు కట్టట్లేదని చాలా ఏళ్ల పాటు అభిమానులు ఫీలవుతూ వచ్చారు. ఐతే ‘ఓజీ’ అనే ఒక్క సినిమాతో వారి కోరికలన్నీ తీర్చేశాడు పవన్. అది ఆయన పొటెన్షియాలిటీని బాగా వాడుకున్న సినిమా. కథ బాగా కుదిరింది. సుజీత్ లాంటి ట్రెండీ డైరెక్టర్ ఆయన్ని అభిమానులు కోరుకునేలా చూపించాడు.
తాజాగా ఒక డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో పాల్గొన్న సుజీత్.. ‘ఓజీ’ తెర వెనుక విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో అభిమానులను ఉర్రూతలూగించిన అనేక షాట్లు ఉన్నాయి. అందులో ఒకటి కెమెరా రివర్స్లో పెట్టి నీటి ప్రతిబింబం నుంచి పవన్ను చూపించే షాట్ ఒకటి ఉంటుంది. అది తెర మీద భలేగా అనిపించింది.
ఐతే ఇలాంటి షాట్ తాను ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కాకముందే తీసినట్లు సుజీత్ తెలిపాడు. షార్ట్ ఫిలిం తీసే రోజుల్లోనే ఆ షాట్ తీసినట్లు చెప్పాడు. ఐతే ఆ షాట్ ఉన్న షార్ట్ ఫిలింను ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికీ దానికి యూట్యూబ్లో వంద పైచిలుకు వ్యూస్ మాత్రమే ఉన్నాయని.. కానీ ఇదే షాట్ ‘ఓజీ’ సినిమాలో పెడితే ఆహా ఓహో అంటూ కొనియాడారని, ఫ్యాన్స్ ఊగిపోయారని సుజీత్ చెప్పాడు.
ఇక ఈ సినిమాలో పవన్ ఇంట్రో సీన్ గురించి కూడా సుజీత్ స్పందించాడు. కటానా పట్టుకుని విధ్వంసం సృష్టిస్తూ సాగే ఆ సన్నివేశాన్ని ఆ శైలిలో ఏ హీరోను పెట్టి తీసినా, మంచి బీజీఎం తోడైతే బాగానే ఉంటుందని.. కానీ ఆ సీన్లో పవన్ నటించడం వల్ల దాని ఎఫెక్ట్ వంద రెట్లు పెరిగిందని సుజీత్ తెలిపాడు.
ఇక ‘ఓజీ’ సినిమా షూట్కు వెళ్లడానికి ముందే తన దగ్గర ఈ చిత్రానికి సంబంధించి రెండున్నర గంటల ఫుటేజ్ ఉన్నట్లు సుజీత్ వెల్లడించాడు. పవన్ చాలా బిజీ కాబట్టి.. పక్కా ప్లానింగ్తో అడుగులు వేయాల్సి వచ్చిందని.. అందుకే తన స్నేహితులను పెట్టి మొత్తం సినిమాలోని సన్నివేశాలను షూట్ చేసి ఆ ఫుటేజ్ పక్కన పెట్టుకున్నానని.. అందువల్ల శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయగలిగానని సుజీత్ తెలిపాడు.
This post was last modified on December 21, 2025 1:00 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…