చికిరి చికిరి పాట వచ్చి యాభై రోజులయ్యింది. ఒక్క తెలుగు వెర్షనే వంద మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ ఇంత గొప్పగా ఉంటుందా అని జెన్ జెడ్ యూత్ ఫీలయ్యే రేంజ్ లో వైరల్ అయిన ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే పెద్ది టైటిల్ సాంగ్ అయిన మస్సా మస్సాని కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయాలని ప్రాథమికంగా అనుకున్నారట. దర్శకుడు బుచ్చిబాబు దానికి అనుగుణంగా ఎడిట్ రెడీ చేసి సిద్ధంగా ఉన్నారట. కాకపోతే ఇప్పుడు దూకాలా ఆగాలా అని ఆలోచిస్తున్నారట.
ఎందుకంటే సంక్రాంతి సినిమాల హడావిడి ఈసారి చాలా ఉండబోతోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారితో పాటు రాజా సాబ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరవై ఏడున ప్రభాస్ ఈవెంట్ ఉంటుంది. కొత్త ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. నెలాఖరులో చిరంజీవి వెంకీ కాంబో సాంగ్ రానుంది. ఇవి కాకుండా మిగిలిన సినిమా అప్డేట్స్ రోజుకు ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంత రష్ లో పెద్ది టైటిల్ సాంగ్ వదిలితే బాగుండదేమోనని బుచ్చిబాబు అనుకుంటున్నట్టుగా సమాచారం. మిగిలినవాళ్ళకు లేనిపోని ఇబ్బంది సృష్టించడం ఎందుకనే ఆలోచన కూడా ఉండొచ్చు.
డిసెంబర్ మినహాయిస్తే పెద్ది చేతిలో కేవలం 86 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మార్చ్ 27 విడుదలలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాల్సి ఉంటుంది. పరిమిత విఎఫ్ఎక్స్ కనక ఎక్కువ ఆలస్యం కాకపోవచ్చు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూలు పూర్తి చేసుకుని ఢిల్లీకి వెళ్తున్న పెద్ది అక్కడ క్లైమాక్స్ ని ముగించుకుని వచ్చేస్తాడు. దీంతో ప్రధాన ఘట్టాలు అయిపోయినట్టే. రెహమాన్ ఐటెం సాంగ్ ఇచ్చేస్తే హీరోయిన్ ని లాక్ చేసి ఫిబ్రవరిలో దాన్ని చిత్రీకరించాలి. మొత్తానికి బుచ్చిబాబు మెడమీద ఒత్తిడనే పెద్ద కత్తి వేలాడబోతోంది. చూడాలి ఎలా మేనేజ్ చేస్తారో.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…