కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్ మీడియా ఫాలో అయ్యే కొందరు అమాయక అభిమానులు అర్థం లేని లీకులను నిజమని భావించి టెన్షన్ పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవలే ఒక గ్రూప్ యూట్యూబర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో కలుసుకున్నారు. వాళ్లలో ఒకడు నాకు పెద్ది స్టోరీ ముందే తెలుసని, అలాంటి కథలో చికిరి చికిరి లాంటి పాట ఎలా పెడతారని ఏదేదో పేలాడు. దానికి మిగిలినవాళ్లు తాళం కొడుతూ అవునా బ్రో అంటూ భుజాలు ఎగరేయడం, ఇదంతా ఓ రేంజ్ కామెడీ అయ్యింది.
ఇంతకీ ఈ లీక్ ఇచ్చిన మహానుభావుడు ఎవరయ్యా అంటే ఇటీవలే ఒక రివ్యూ విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిన వీరుడు. పేరులోనే చిత్ర విచిత్రమైన పదాలు పెట్టుకున్న ఈ సదరు యుట్యూబర్ కు ఆ నిర్మాత ఓ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం వైరల్ అయింది. విచారణ జరిగాక అందరూ దాన్ని మర్చిపోయారు కానీ ఇలా ప్యాన్ ఇండియా సినిమాల గురించి ఇష్టం వచ్చినట్టు పేలేవాళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రీమియర్లు వేసినప్పుడు, ఈవెంట్లు జరిగినప్పుడు, టికెట్లు ఉచితంగా పంపి మరీ కొందరు పిఆర్ లు ఈ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఇలాంటి గాలి బ్యాచులకు వందల కోట్లతో తీసే ప్యాన్ ఇండియా సినిమాల కథలు కాదు కదా కనీసం వాటికి పనిచేసే లైట్ బాయ్స్ తో కూడా పరిచయాలు ఉండవు. కేవలం ఏదో ఒక చోట వచ్చిన చిన్న లీకును పట్టుకుని దాని చుట్టూ స్టోరీ అల్లేసుకుని ఇలా గర్వంగా చెప్పుకు తిరుగుతారు. ఇది బ్లైండ్ గా నమ్మేసిన అభిమానులు అయ్యో మా హీరో హిట్టు కొడతాడో లేదోనని ఆందోళన పడుతారు. అయినా రివ్యూల పేరుతో దందాలు చేసుకునే వీళ్ళ మాటలు ఒక్క శాతం నమ్మాల్సిన అవసరంలేదు. పెద్దినే కాదు అంతకన్నా పెద్ద పెద్ద సినిమాల గురించి వీళ్లకు నయా పైసా తెలియదన్నది అసలు నిజం.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…