కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు. కొందరేమో ప్రోమోల ద్వారా కథ మీద ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేలా చేస్తుంటారు. ప్రమోషన్లలో కూడా కథ గురించి ఓపెన్ అవుతుంటారు. ఐతే కథ గురించి ముందే ఒక ఐడియా ఇచ్చేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది.
స్టోరీ ఎక్కువ ఓపెన్ చేయడం వల్ల కొన్నిసార్లు సినిమాకు ప్రతికూలంగా కూడా మారుతుంటుంది. కానీ తమకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదంటూ శంబాల సినిమా స్టోరీ ఏంటో ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు యువ కథానాయకుడు ఆది సాయికుమార్.
ఆది చెప్పిన ప్రకారం.. ఇందులో హీరో ఒక యువ సైంటిస్ట్. అతను ప్రతి విషయాన్నీ సైంటిఫిక్ కోణంలో చూస్తాడు. అలాంటి వాడు.. ఒక పల్లెటూరిలో ఒక ఆస్టరాయిడ్ పడిందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఆస్టరాయిడ్ శాస్త్ర సంబంధిత విషయం అని అతను పరిశోధన చేయాలనుకుంటాడు. కానీ ఆ ఊరిలో అందరికీ దైవ భక్తి ఎక్కువ.
మూఢ నమ్మకాలను ఎక్కువ నమ్ముతారు. ఆ ఊరిలో ఆస్టరాయిడ్ పడడాన్ని దుష్ట శక్తికి సంబంధించిన విషయంగా వాళ్లు భావిస్తారు. అలాంటి స్థితిలో ఆ ఊరి వాళ్లతో పోరాడి ఆ ఆస్టరాయిడ్కు సంబంధించిన వ్యవహారాన్ని హీరో ఎలా తేల్చాడు అన్నది ఈ సినిమా కథ.
మూఢ నమ్మకాలున్న ఊరికి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న హీరో వెళ్లి నిజానిజాలు నిగ్గు తేల్చడం అనే పాయింట్ మీద గతంలో చాలా కథలే వచ్చాయి. కార్తికేయ కూడా ఈ లైన్లో సాగే సినిమానే. ఇలాంటి సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ.. తమ సినిమాలో అంతకుమించిన విశేషాలు, కొత్తదనం ఉందని అంటున్నాడు ఆది.
శంబాల స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా అని.. ఇందులో కొత్త సీన్లు చాలా ఉంటాయని.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా సాగుతుందని ఆది చెప్పాడు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న రాబోతున్న ఈ చిత్రాన్ని యుగంధర్ ముని డైరెక్ట్ చేశాడు.
This post was last modified on December 18, 2025 10:07 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…